Reasi Bus Terror Attack : రియాసి బస్సుపై దాడి కేసులో అనేక చోట్ల ఎన్ఐఏ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reasi Bus Terror Attack : జమ్మూకశ్మీర్లోని రియాసి బస్సు దాడికి సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈరోజు రెండు జిల్లాల్లోని ఏడు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. ఎన్ఐఏ సోదాలు చేస్తున్న ప్రదేశాలు హైబ్రిడ్ టెర్రరిస్టులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్లతో ముడిపడి ఉన్నాయి. భక్తులతో నిండిన బస్సుపై జూన్ 9న ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది మృతి చెందగా, పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. రియాసీ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ రియాసి, రాజౌరి ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. ఈ ఉగ్రదాడి కేసు దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జూన్ 17న ఎన్ఐఏకు అప్పగించింది.
Read Also:Yuvraj Singh: ధోనీ, కోహ్లీ, రోహిత్.. యువరాజ్ ఫేవరెట్ కెప్టెన్ ఎవరో తెలుసా?
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ఈ ఘటన జూన్ 9వ తేదీన జరిగింది. జమ్మూలోని రియాసి జిల్లాలోని మాతా వైష్ణో దేవి ఆలయానికి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు ఉగ్రవాదుల దాడిలో లోయలో పడింది, తొమ్మిది మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. దాడులకు సంబంధించి, జూన్ 9 సాయంత్రం 6:10 గంటలకు శివఖోడి ఆలయం నుండి మాతా వైష్ణో దేవి ఆలయం బేస్ క్యాంప్కు తిరిగి వస్తున్న బస్సు తెరయాత్ గ్రామంలో మెరుపుదాడికి గురైనప్పుడు ఈ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. దాడి సమయంలో, బస్సు డ్రైవర్ గాయపడ్డాడు. అతను తన వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దాడికి సంబంధించి 50 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also:Kerala : సినిమా స్టైల్లో హైవే పై కారును వెంబడించి 2.5 కిలోల బంగారం దోపిడీ
దాడి జరిగిన కొద్ది రోజుల తర్వాత జూన్ 17న హోం మంత్రిత్వ శాఖ ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించింది. నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఈ దాడికి బాధ్యులమని తొలుత ప్రకటించుకున్నప్పటికీ ఆ తర్వాత తన వాదనను ఉపసంహరించుకుంది. ఇప్పటివరకు, రాజౌరికి చెందిన హకమ్ ఖాన్ ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం, లాజిస్టిక్స్ సరఫరా చేసినందుకు… దాడికి ముందు నిఘాలో సహాయం చేసినందుకు అరెస్టయ్యాడు. అంతకుముందు, జూన్ 30 న, రాజౌరిలోని హైబ్రిడ్ ఉగ్రవాదులు, వారి ఓవర్గ్రౌండ్ కార్యకర్తలతో సంబంధం ఉన్న ఐదు రహస్య స్థావరాలపై దర్యాప్తు సంస్థ దాడి చేసింది.
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!