Bhuni Toll Plaza: జవాన్ పై దాడి.. టోల్ ఏజెన్సీపై NHAI కఠిన చర్యలు.. రూ. 20 లక్షల జరిమానా, బ్లాక్ లిస్ట్ కు సన్నాహాలు..
- భూని టోల్ ఏజెన్సీపై NHAI కఠిన చర్యలు
- రూ. 20 లక్షల జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 17 రాత్రి మీరట్-కర్నాల్ జాతీయ రహదారి (NH-709A)లోని భూని టోల్ ప్లాజా వద్ద దారుణం చోటుచేసుకుంది. టోల్ సిబ్బంది భారత ఆర్మీ జవాన్ కపిల్ సింగ్, అతని సోదరుడు శివంపై దారుణంగా దాడి చేశారు. ఈ సంఘటన తర్వాత, నేషనల్ హైవే అథారిటీ (NHAI) కఠిన చర్యలు తీసుకుంది. టోల్ వసూలు సంస్థ అయిన మెస్సర్స్ ధరమ్ సింగ్ & కంపెనీపై రూ. 20 లక్షల జరిమానా విధించింది. ఆ కంపెనీ కాంట్రాక్ట్ ను రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో టోల్ ప్లాజా బిడ్డింగ్లో పాల్గొనకుండా నిరోధించే ప్రక్రియను ప్రారంభించింది.
Also Read:Coolie : ఈ కూలీ కూలి ఎక్కువే.. మాస్ రాంపేజ్.. ఎన్ని వందల కోట్లంటే?
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన NHAI వెంటనే చర్య తీసుకుని టోల్ వసూలు సంస్థపై రూ.20 లక్షల భారీ జరిమానా విధించింది. కంపెనీ తన ఉద్యోగులను క్రమశిక్షణతో ఉంచడంలో, టోల్ ప్లాజా వద్ద శాంతిభద్రతలను కాపాడుకోవడంలో విఫలమైందని, ఇది ఒప్పందానికి పెద్ద ఉల్లంఘన అని NHAI ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఇటువంటి ప్రవర్తనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, జాతీయ రహదారులపై ప్రయాణీకుల సురక్షితమైన, అంతరాయం లేని ప్రయాణాన్ని నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నాము’ అని NHAI ఒక ప్రకటన విడుదల చేసింది.
Also Read:Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాలతో కిరణ్ అబ్బవరం?
మీరట్లోని గోట్కా గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కపిల్ సింగ్ ఆగస్టు 17 రాత్రి తన బంధువు శివంతో కలిసి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్నాడు. శ్రీనగర్లో తన విధుల్లో చేరాల్సి ఉంది. భూని టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమయం లేకపోవడం వల్ల, వాహనాన్ని త్వరగా వెళ్లనివ్వమని కపిల్ టోల్ ఉద్యోగులను విజ్ఞప్తి చేశాడు. దీనిపై వివాదం తీవ్రమైంది. టోల్ ఉద్యోగులు జవాన్ పై దాడికి దిగారు. ఉద్యోగులు కపిల్ను ఒక స్తంభానికి కట్టివేసి కర్రలతో కొట్టారని, ఒక ఉద్యోగి ఇటుకను ఎత్తడానికి కూడా ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. మీరట్ పోలీసులు వెంటనే చర్య తీసుకుని ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కొంతమంది నిందితులను అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇతర నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!