Bhuni Toll Plaza: జవాన్ పై దాడి.. టోల్ ఏజెన్సీపై NHAI కఠిన చర్యలు.. రూ. 20 లక్షల జరిమానా, బ్లాక్ లిస్ట్ కు సన్నాహాలు..
- భూని టోల్ ఏజెన్సీపై NHAI కఠిన చర్యలు
- రూ. 20 లక్షల జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 17 రాత్రి మీరట్-కర్నాల్ జాతీయ రహదారి (NH-709A)లోని భూని టోల్ ప్లాజా వద్ద దారుణం చోటుచేసుకుంది. టోల్ సిబ్బంది భారత ఆర్మీ జవాన్ కపిల్ సింగ్, అతని సోదరుడు శివంపై దారుణంగా దాడి చేశారు. ఈ సంఘటన తర్వాత, నేషనల్ హైవే అథారిటీ (NHAI) కఠిన చర్యలు తీసుకుంది. టోల్ వసూలు సంస్థ అయిన మెస్సర్స్ ధరమ్ సింగ్ & కంపెనీపై రూ. 20 లక్షల జరిమానా విధించింది. ఆ కంపెనీ కాంట్రాక్ట్ ను రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో టోల్ ప్లాజా బిడ్డింగ్లో పాల్గొనకుండా నిరోధించే ప్రక్రియను ప్రారంభించింది.
Also Read:Coolie : ఈ కూలీ కూలి ఎక్కువే.. మాస్ రాంపేజ్.. ఎన్ని వందల కోట్లంటే?
Also Read
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన NHAI వెంటనే చర్య తీసుకుని టోల్ వసూలు సంస్థపై రూ.20 లక్షల భారీ జరిమానా విధించింది. కంపెనీ తన ఉద్యోగులను క్రమశిక్షణతో ఉంచడంలో, టోల్ ప్లాజా వద్ద శాంతిభద్రతలను కాపాడుకోవడంలో విఫలమైందని, ఇది ఒప్పందానికి పెద్ద ఉల్లంఘన అని NHAI ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఇటువంటి ప్రవర్తనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, జాతీయ రహదారులపై ప్రయాణీకుల సురక్షితమైన, అంతరాయం లేని ప్రయాణాన్ని నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నాము’ అని NHAI ఒక ప్రకటన విడుదల చేసింది.
Also Read:Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాలతో కిరణ్ అబ్బవరం?
మీరట్లోని గోట్కా గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కపిల్ సింగ్ ఆగస్టు 17 రాత్రి తన బంధువు శివంతో కలిసి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్నాడు. శ్రీనగర్లో తన విధుల్లో చేరాల్సి ఉంది. భూని టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమయం లేకపోవడం వల్ల, వాహనాన్ని త్వరగా వెళ్లనివ్వమని కపిల్ టోల్ ఉద్యోగులను విజ్ఞప్తి చేశాడు. దీనిపై వివాదం తీవ్రమైంది. టోల్ ఉద్యోగులు జవాన్ పై దాడికి దిగారు. ఉద్యోగులు కపిల్ను ఒక స్తంభానికి కట్టివేసి కర్రలతో కొట్టారని, ఒక ఉద్యోగి ఇటుకను ఎత్తడానికి కూడా ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. మీరట్ పోలీసులు వెంటనే చర్య తీసుకుని ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కొంతమంది నిందితులను అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇతర నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..