Bhuni Toll Plaza: జవాన్ పై దాడి.. టోల్ ఏజెన్సీపై NHAI కఠిన చర్యలు.. రూ. 20 లక్షల జరిమానా, బ్లాక్ లిస్ట్ కు సన్నాహాలు..
- భూని టోల్ ఏజెన్సీపై NHAI కఠిన చర్యలు
- రూ. 20 లక్షల జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 17 రాత్రి మీరట్-కర్నాల్ జాతీయ రహదారి (NH-709A)లోని భూని టోల్ ప్లాజా వద్ద దారుణం చోటుచేసుకుంది. టోల్ సిబ్బంది భారత ఆర్మీ జవాన్ కపిల్ సింగ్, అతని సోదరుడు శివంపై దారుణంగా దాడి చేశారు. ఈ సంఘటన తర్వాత, నేషనల్ హైవే అథారిటీ (NHAI) కఠిన చర్యలు తీసుకుంది. టోల్ వసూలు సంస్థ అయిన మెస్సర్స్ ధరమ్ సింగ్ & కంపెనీపై రూ. 20 లక్షల జరిమానా విధించింది. ఆ కంపెనీ కాంట్రాక్ట్ ను రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో టోల్ ప్లాజా బిడ్డింగ్లో పాల్గొనకుండా నిరోధించే ప్రక్రియను ప్రారంభించింది.
Also Read:Coolie : ఈ కూలీ కూలి ఎక్కువే.. మాస్ రాంపేజ్.. ఎన్ని వందల కోట్లంటే?
Also Read
- Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
- Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
- Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన NHAI వెంటనే చర్య తీసుకుని టోల్ వసూలు సంస్థపై రూ.20 లక్షల భారీ జరిమానా విధించింది. కంపెనీ తన ఉద్యోగులను క్రమశిక్షణతో ఉంచడంలో, టోల్ ప్లాజా వద్ద శాంతిభద్రతలను కాపాడుకోవడంలో విఫలమైందని, ఇది ఒప్పందానికి పెద్ద ఉల్లంఘన అని NHAI ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఇటువంటి ప్రవర్తనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, జాతీయ రహదారులపై ప్రయాణీకుల సురక్షితమైన, అంతరాయం లేని ప్రయాణాన్ని నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నాము’ అని NHAI ఒక ప్రకటన విడుదల చేసింది.
Also Read:Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాలతో కిరణ్ అబ్బవరం?
మీరట్లోని గోట్కా గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కపిల్ సింగ్ ఆగస్టు 17 రాత్రి తన బంధువు శివంతో కలిసి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్నాడు. శ్రీనగర్లో తన విధుల్లో చేరాల్సి ఉంది. భూని టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమయం లేకపోవడం వల్ల, వాహనాన్ని త్వరగా వెళ్లనివ్వమని కపిల్ టోల్ ఉద్యోగులను విజ్ఞప్తి చేశాడు. దీనిపై వివాదం తీవ్రమైంది. టోల్ ఉద్యోగులు జవాన్ పై దాడికి దిగారు. ఉద్యోగులు కపిల్ను ఒక స్తంభానికి కట్టివేసి కర్రలతో కొట్టారని, ఒక ఉద్యోగి ఇటుకను ఎత్తడానికి కూడా ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. మీరట్ పోలీసులు వెంటనే చర్య తీసుకుని ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కొంతమంది నిందితులను అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇతర నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!