Team India: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బూస్ట్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నెం.1
- తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ నెం.1
- 119 రేటింగ్లో మొదటి స్థానంలో టీమిండియా
- రెండో స్థానంలో ఆస్ట్రేలియా
- ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్కు కలిసొచ్చే అంశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియాకు ఇదొక మంచి ఎనర్జీ.. ఇంగ్లండ్తో తాజాగా జరిగిన వన్డే సిరీస్ను భారత్ కైవసం చేసుకుని మంచి జోరు మీదుంది. ఈ సిరీస్లోని ఒక మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగడం జట్టుకు శుభపరిణామం. ఎందుకంటే రోహిత్ ఫాంలోకి వస్తే.. భారత్కు విజయావకాశాలు ఎక్కువ. విరాట్ కోహ్లీ కూడా చివరి వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ నెం.1గా నిలిచింది. ఇంగ్లండ్ను క్లీన్ స్వీప్ చేయడంతో టీమిండియా 119 రేటింగ్లో మొదటి స్థానంలో ఉంది.
Read Also: Jatadhara : సుధీర్ బాబు ‘జటాధర’ మొదలైంది!
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
మరోవైపు.. ముక్కోణపు సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించిన న్యూజిలాండ్ జట్టు.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మంచి ఫలితాన్ని సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ విజయం న్యూజిలాండ్ జట్టుకు మనోధైర్యాన్ని మరింత పెంచుతుంది. పాకిస్తాన్ పై విజయంతో న్యూజిలాండ్ వారి వన్డే ర్యాంకింగ్స్లో 100 నుండి 105కి పెరిగింది. దీంతో.. న్యూజిలాండ్ జట్టు నాల్గవ స్థానానికి చేరుకుంది. ఫైనల్లో ఓడిపోయిన పాకిస్తాన్ 107 రేటింగ్తో మూడవ స్థానానికి పడిపోయింది. అటు.. శ్రీలంకపై ఆస్ట్రేలియా 0-2 తేడాతో ఓటమి పాలైంది. దీంతో.. 110 రేటింగ్తో ప్రస్తుత వన్డే ర్యాంకింగ్స్లో రెండవ స్థానంలో ఉంది.
Read Also: CM Chandrababu: అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేయగలం..
కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్ నాటికి ఈ జట్ల ఐసీసీ ర్యాంకింగ్స్పై ప్రభావం పడవచ్చు. టోర్నమెంట్ ఫైనల్ మార్చి 9న జరుగుతుంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!