Andhra University: ఏయూ ప్రొఫెసర్ లైంగిక వేధింపుల్లో కొత్త ట్విస్ట్..!
Andhra University: ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ సత్యనారాయణపై లైంగిక వేధింపుల ఆరోపణ వచ్చిన విషయం తెలిసిందే కాగా.. హిందీ ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత మీడియా ముందుకు బాధితురాలి భర్త వచ్చారు.. జాతీయ మహిళా కమిషన్, పోలీసులు, యూనివర్శిటీ విచారణ జరుపుతోందని.. మూడు నెలల క్రితం మేం ఫిర్యాదు చేశామన్నారు.. ఇక, దురుద్దేశపూర్వకంగా ప్రొఫెసర్ సత్యనారాయణ ప్యానెల్ ఇవ్వ కుండా అడ్డుకుంటున్నారు.. అర్హత లేకుండా యూనివర్శిటీలో నియామకం, పీహెచ్డీ అడ్మిషన్లలో అక్రమాలు సహా ప్రొఫెసర్ సత్యనారాయణ చేస్తున్నవి నిరాధారమైన ఆరోపణలు అని కొట్టిపారేశారు. ఈ వ్యవహారంలో మీడియా ప్రమేయం అనవసరం, ఇది పూర్తిగా చట్టబద్ధంగా జరుతున్న విచారణ. యూనివర్సిటీ అధికారులు మాత్రమే సమాధానం చెప్పాలి అని బాధితురాలి భర్త ఉజ్వల్ ఘటక్ డిమాండ్ చేశారు.
అయితే, ఉజ్వల్ ఘటక్ అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా ఈ వ్యవహారాలన్నీ యూనివర్సిటీ అధికారులు నడుపుతున్నారని ప్రొఫెసర్ ఆరోపించారు. డిఫెన్స్ లిక్కర్ వ్యాపారం చేస్తూ యూనివర్సిటీ అధికారులను ఉజ్వల్ చెప్పుచేతల్లో పెట్టుకున్నాడని ఆరోపించారు. తన భార్యకు అర్హత లేకపోయినా ఫ్రీ పీహెచ్డీ కోసం ఒత్తిడి తెచ్చారని, నిబంధనలకు విరుద్ధమని తిరస్కరించినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రొఫెసర్ సత్యనారాయణ ఆరోపించారు.. ఒక్కరోజు కూడా డిపార్ట్ మెంట్కు రాని మహిళపై లైంగిక వేధింపులు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
Also Read
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
ఇక, రీసెర్చ్ స్కాలర్ పై లైంగిక వేధింపులు, పీహెచ్డీల అమ్మకాల ఆరోపణలపై ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణ మోహన్ విచారణ జరుపుతున్నారు.. ప్రొఫెసర్ పై వచ్చిన లైంగిక ఆరోపణలపై ప్రొసీజర్ ప్రకారం విచారణ చేశామన్న ఆయన.. ప్రాథమిక విచారణలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ వల్లే పరస్పరం విరుద్ధ ఆరోపణలు చేసుకుంటున్నారని తెలిపారు.. అయితే, వాస్తవ నివేదికను ఇవ్వమని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.. హిందీ యూనివర్సిటీ హెచ్వోడీ ప్రొఫెసర్ సత్యనారాయణ అనవసరంగా యూనివర్సిటీకి రుద్దుతున్నారని వ్యాఖ్యానించారు.. గతంలో ఎప్పుడూ ప్రొఫెసర్ సత్యనారాయణ ఇలాంటి ఆరోపణలు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారో విచారణ చేయిస్తాం.. కానీ, పీహెచ్డీలు అమ్ముకుంటున్నారన్నది అవాస్తవమని క్లారిటీ వచ్చారు రిజిస్ట్రార్ కృష్ణ మోహన్.
కాగా, ఏయూలో హిందీ విభాగం హెడ్, ప్రొఫెసర్ సత్యనారాయణపై రీసెర్చ్ స్కాలర్ సోనాలి ఘటక్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం విదితమే.. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్కు సోనాలి ఫిర్యాదు చేశారు.. ప్రీ – టాక్ వైవా కోసం రెండు లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు.. తన వద్ద నుంచి ఇప్పటికే రూ.75 వేలు తీసుకున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొనడం కలకలం రేపుతోంది.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
-
KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?