New Rules from January 1: జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్.. సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందంటే..?
- జనవరి 1, 2026 నుంచి అనేక కొత్త నిబంధనలు, విధాన మార్పులు అమల్లోకి
- ప్రధాన బ్యాంకులు రుణ వడ్డీ రేట్లు తగ్గించడంతో కొత్త రుణాలు తీసుకున్న వారికి లాభం
- ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లలో మార్పులు
- యూపీఐ, డిజిటల్ చెల్లింపులపై నిబంధనలు మరింత కఠినతరం
- జనవరి 1 నుంచి పాన్–ఆధార్ అనుసంధానం తప్పనిసరి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Rules from January 1: మరోవారం రోజుల్లో 2025 ముగియనుండగా.. కొత్త ఏడాది 2026 నుంచి అనేక విధాన, నియంత్రణ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇవి రైతులు, ఉద్యోగులు, సాధారణ ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. జనవరి 1 నుండి బ్యాంకింగ్ నిబంధనలు, సోషల్ మీడియా నియంత్రణలు, ఇంధన ధరలు, ప్రభుత్వ పథకాలు వంటి కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. మరి ఎంటువంటి మార్పులు రాబోతున్నాయి ఒకసారి చూసేద్దామా..
Also Read
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
బ్యాంకింగ్ నిబంధనలు:
క్రెడిట్ స్కోర్ అప్డేట్ విధానంలో కీలక మార్పు రానుంది. ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి నవీకరణలు జరిగితే.. ఇకపై ప్రతి వారం క్రెడిట్ బ్యూరోలు కస్టమర్ డేటాను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో క్రెడిట్ స్కోర్ మరింత ప్రభావితం కానుంది. ఎస్బీఐ, పీఎన్బీ, హెచ్డీఎఫ్సీ వంటి ప్రధాన బ్యాంకులు ఇప్పటికే రుణ వడ్డీ రేట్లు తగ్గించాయి. ఈ నిర్ణయం కొత్త సంవత్సరంలో రుణాలు తీసుకున్న వారికి లాభం చేకూర్చనుంది. అలాగే, జనవరి 2026 నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లలో కూడా మార్పులు అమలుకానున్నాయి. అలాగే యూపీఐ, డిజిటల్ చెల్లింపులపై నిబంధనలు మరింత కఠినతరం అవనున్నాయి. అలాగే పాన్ కార్డు, ఆధార్ లింకేజీపై కఠిన అమలు జరగనుంది. జనవరి 1 నుంచి పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం తప్పనిసరి. ఇది లేకపోతే బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది.
సోషల్ మీడియా నియంత్రణ:
16 ఏళ్ల లోపు పిల్లల కోసం కఠినమైన సోషల్ మీడియా నిబంధనలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాల తరహాలో వయస్సు ఆధారిత పరిమితులు, తల్లిదండ్రుల నియంత్రణలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇంకా వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్స్లో మోసాలను అరికట్టేందుకు సిమ్ వెరిఫికేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేశారు.
ట్రాఫిక్ నియంత్రణలు:
కాలుష్య నియంత్రణలో భాగంగా పలు నగరాల్లో డీజిల్, పెట్రోల్ వాణిజ్య వాహనాలపై కొత్త ఆంక్షలు అమలు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పెట్రోల్ వాహనాల ద్వారా డెలివరీలపై పరిమితులు విధించే ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి.
India-New Zealand: భారత్తో ఒప్పందాన్ని తప్పుపట్టిన న్యూజిలాండ్ మంత్రి.. ‘బ్యాడ్ డీల్’ అంటూ అభ్యంతరం
ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట:
డిసెంబర్ 31తో 7వ వేతన సంఘం గడువు ముగియనున్న నేపథ్యంలో.. జనవరి 1, 2026 నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. అలాగే, జనవరి 2026 నుంచి డియర్నెస్ అలవెన్స్ (DA) పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఇది ఉద్యోగులకు కొంత ఊరట ఇవ్వనుంది. హర్యానా వంటి కొన్ని రాష్ట్రాలు పార్ట్టైమ్, రోజువారీ కూలీల కనీస వేతనాల పెంపుపై కూడా సమీక్ష చేయనున్నాయి.
రైతులకు కీలక మార్పులు:
ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతులకు ప్రత్యేక యూనిక్ ఐడీలు జారీ చేస్తున్నారు. ఇవి పీఎం కిసాన్ పథకం కింద వచ్చే వాయిదాల కోసం తప్పనిసరి కానున్నాయి. ఐడి లేకపోతే లబ్ధిదారులకు నగదు జమ కాకపోవచ్చు. పీఎం కిసాన్ పంట బీమా పథకం కింద అడవి జంతువుల వల్ల పంట నష్టం జరిగినా పరిహారం పొందే అర్హత రైతులకు కల్పించనున్నారు. అయితే నష్టం జరిగిన 72 గంటల్లోగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
సాధారణ ప్రజలపై ప్రభావం:
జనవరిలో కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది బ్యాంకింగ్ లావాదేవీలు, ఖర్చుల వివరాలతో ముందే నింపబడిన విధంగా ఉండనుంది. దీంతో రిటర్న్ దాఖలు సులభమవుతుందే కానీ, పర్యవేక్షణ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు జనవరి 1 నుంచి ఎల్పీజీ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు సవరించనున్నారు. అదే రోజున విమాన ఇంధనం (ATF) ధరల్లోనూ మార్పులు అమలవుతాయి. ఇవి గృహ బడ్జెట్తో పాటు విమాన టికెట్ ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Mirzapur The Movie : మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..