New Digital Payment Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. డిజిటల్ చెల్లింపుల కోసం ఇది తప్పనిసరి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Digital Payment Rules: ఏప్రిల్ 1, 2026 నుంచి దేశంలో డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులతో ఆన్లైన్ లావాదేవీలు మరింత సురక్షితంగా మారనున్నాయి. ముఖ్యంగా సైబర్ మోసాలను అరికట్టే లక్ష్యంతో ఈ కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాల ప్రకారం, ఇకపై ప్రతి డిజిటల్ లావాదేవీకి రెండు-దశల ప్రమాణీకరణ తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు కేవలం OTP ఆధారంగా జరిగే లావాదేవీలు ఇకపై సరిపోవు. వినియోగదారులు కనీసం రెండు వేర్వేరు ధృవీకరణ విధానాలను ఉపయోగించాల్సి ఉంటుంది.
ఈ నిబంధన సెప్టెంబర్ 2025లో ప్రకటించబడగా, బ్యాంకులకు అమలు కోసం ఏప్రిల్ 1, 2026 వరకు గడువు ఇచ్చారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డులపై ఇప్పటికే 2FA అమల్లో ఉండగా, ఇకపై అన్ని రకాల డిజిటల్ లావాదేవీలకు ఇది వర్తించనుంది.
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
2FAలో ఉపయోగించే ధృవీకరణ పద్ధతులు
డిజిటల్ చెల్లింపుల సమయంలో ఇలా..
* వ్యక్తిగత గుర్తింపు సంఖ్య (PIN)
* వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు వంటి బయోమెట్రిక్ విధానాలు
* బ్యాంకింగ్ యాప్లలో రూపొందించే వర్చువల్ టోకెన్లు
* SMS ద్వారా వచ్చే OTP
ఈ విధానాలలో కనీసం రెండు ఉపయోగించి లావాదేవీని పూర్తి చేయాలి: ఉదాహరణకు.. OTP + PIN… బయోమెట్రిక్ ధృవీకరణ + పరికరం గుర్తింపు.. టోకెన్ + పాస్వర్డ్..
లావాదేవీలలో మార్పులు ఎలా ఉంటాయి?
ఉదాహరణకు, మీరు ఒక దుకాణంలో డెబిట్ కార్డు ద్వారా చెల్లింపు చేస్తే, ముందుగా PIN నమోదు చేయడం మాత్రమే కాకుండా, అదనంగా OTP లేదా మరొక ధృవీకరణ అవసరం అవుతుంది. అలాగే ఆన్లైన్ చెల్లింపుల సమయంలో కూడా రెండు-స్థాయి ధృవీకరణ తప్పనిసరి అవుతుంది.
సైబర్ మోసాలకు అడ్డుకట్ట
ఇటీవలి కాలంలో ఫిషింగ్, సిమ్ స్వాపింగ్, OTP మోసాలు విపరీతంగా పెరిగాయి. మోసగాళ్లు వినియోగదారుల OTPలను సేకరించి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న ఘటనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో 2FA అమలు చేయడం ద్వారా అనధికార లావాదేవీలను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక, ఈ నిబంధనలు కేవలం దేశీయ లావాదేవీలకే కాకుండా, అంతర్జాతీయ ఆన్లైన్ చెల్లింపులకు కూడా వర్తించనున్నాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, అక్టోబర్ 1, 2026 నాటికి అంతర్జాతీయ కార్డ్-నాట్-ప్రెజెంట్ లావాదేవీలకు కూడా ఇదే విధమైన భద్రతా ప్రమాణాలు తప్పనిసరి అవుతాయి.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!