Corona : సింగపూర్లో కలకలం రేపుతున్న మరో కరోనా వేవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona : కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఎంతలా భయపెట్టిందో తెలుసుకదా.. మహమ్మారి ప్రభావంతో దేశాల ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలం అయిపోయాయి. కోట్ల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతో మంది ఉద్యోగాలు పోవడంతో రోడ్డున పడ్డారు. జీవితాలన్నీ తారుమారయ్యాయి. ఒక శకానికి సరిపడా చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. కరోనా నివారణకు పలు దేశాలు ఇప్పటికీ లాక్ డౌన్ మంత్రం పాటిస్తున్నాయి. కానీ వైరస్ ప్రభావం తగ్గడం లేదు. మహమ్మారి తన రూపాన్ని మార్చుకుంటూ విజృంభిస్తోంది.
Read Also: Taiwan China: తగ్గేదేలే అంటున్న తైవాన్.. చైనా ఆధిపత్యంపై జిన్ పింగ్కు వార్నింగ్
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
తాజాగా సింగపూరులో మరో కొత్త కరోనా వేవ్ను ఎక్స్బీబీ సబ్ వేరియంట్ వైద్యులు గుర్తించారు. దీంతో ఆ దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్ 3 నుంచి 9 వరకు 54 శాతంపైగా కరోనా కేసులు ఎక్స్బీబీ సబ్ వేరియంట్వేనని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, డెన్మార్క్, భారత్, జపాన్తో సహా 17 దేశాల్లో ఈ కరోనా వేరియంట్ను గుర్తించినట్లు ఓంగ్ యే కుంగ్ తెలిపారు. ఎక్స్బీబీ సబ్ వేరియంట్ విజృంభణతో తమ దేశంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని ఓంగ్ యే కుంగ్ వెల్లడించారు. అలాగే కరోనా నుంచి కోలుకున్న వారికి కూడా తిరిగి వ్యాపిస్తుందని తెలిపారు.
Read Also:Hansika: పెళ్లి పీటలు ఎక్కనున్న దేశముదురు బ్యూటీ.. వెన్యూ ఎక్కడంటే..?
మరోవైపు ఎక్స్బీబీ సబ్ వేరియంట్ వల్ల కరోనా కేసులు నవంబర్ నెల మధ్యలో గరిష్ఠస్థాయికి చేరవచ్చని తెలిపింది సింగపూర్ ప్రభుత్వం. ఈ వేవ్ పీక్ స్టేజ్లో ప్రతి రోజు సగటున 15,000 కేసులు నమోదు కావచ్చని అంచనా వేసింది సింగపూర్ ప్రభుత్వం. అయితే ఈ వేవ్ స్వల్ప కాలం పాటు ఉండవచ్చని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ చెప్పారు. తాజా కరోనా పరిస్థితిని, ఆరోగ్య వ్యవస్థపై ప్రభావాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు అధికారులు. అవసరమైతే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేయడంతోపాటు సురక్షిత పద్ధతులను అమలు చేస్తామని ఓంగ్ యే కుంగ్ అన్నారు. వర్క్ ఫ్రం హోమ్ను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, అక్టోబర్ 14 నాటికి సింగపూర్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,997,847కు, మొత్తం మరణాల సంఖ్య 1,641కు చేరింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!