Israel Gaza War: ఇజ్రాయెల్ బాస్ కొత్త ప్లాన్.. అంగీకరించకపోతే రాజీనామే గతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Gaza War: ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇజ్రాయెల్ శక్తిసామర్థ్యాలపైన కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక అవగాహన ఉంది. తాజాగా ఇజ్రాయెల్ స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం మొదలై దాదాపు 22 నెలలవుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు గాజాలో దాదాపు 61 వేలమందికి పైగా మృతి చెందారు. మరోవైపు హమాస్ చెరలో ఇంకా దాదాపు 50 మంది బందీలు ఉన్నట్లు ఇజ్రాయెల్ అధికారులు చెప్తున్నారు.
READ MORE: Marijuana: గంజాయి.. ఇప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి..
Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
సెక్యూరిటీ క్యాబినెట్ ముందుకు కొత్త ప్లాన్..
గాజాలో దాడులను మరింత విస్తరించేందుకు, హమాస్ను పూర్తిగా అంతమొందించడంతో పాటు బందీలను విడిపించేందుకు నెతన్యాహు అప్డేట్ చేసిన యుద్ధ ప్రణాళికను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన గాజా స్ట్రిప్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే ప్రతిపాదనను సెక్యూరిటీ క్యాబినెట్ ముందు ఉంచుతానని తన మంత్రులతో ప్రైవేటు సంభాషణల్లో చెప్పినట్లు సంబంధిత వర్గాలు ఉటంకించాయి. గాజాలో దాదాపు 75 శాతం భూభాగం ప్రస్తుతం ఐడీఎఫ్ నియంత్రణలో ఉంది. నూతన ప్రణాళిక ప్రకారం మిగిలిన భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. దీన్ని ఐడీఎఫ్ వ్యతిరేకిస్తోంది. ఒకవేళ దీనికి ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంగీకరించకపోతే.. ఆయన రాజీనామా చేయాలని నెతన్యాహు స్పష్టం చేసినట్లు తెలిపాయి.
READ MORE: Udayabhanu : ఆర్టిస్టుల ఆకలి తీర్చే పాత్రలో నటించా!
ఐడీఎఫ్ అభ్యంతరాలు..
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) నుంచి గాజా స్ట్రిప్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. కానీ ప్రధాని నెతన్యాహు మాత్రం ముందుకే వెళ్లాలని నిర్ణయించినట్లు, గాజాలో బందీలను దాచి ఉంచిన ప్రాంతాల్లోనూ సైనిక ఆపరేషన్లు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ చర్యతో బందీల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఐడీఎఫ్ పేర్కొంటోంది. అదే విధంగా.. హమాస్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసేందుకు అనేక సంవత్సరాలు పట్టొచ్చని అంచనా వేస్తోంది. ఈ ప్లాన్ను పాలస్తీనా అథారిటీ అధికారులూ ఖండించారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకొని కొత్త సైనిక ఆక్రమణలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
-
Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?