Nepal : నదిలో పడిన బస్సు.. ఏడుగురి మృతి, 30మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal : నేపాల్లోని బాగ్మతి ప్రావిన్స్లో బుధవారం తెల్లవారుజామున ప్రయాణీకుల బస్సు నదిలో పడిపోవడంతో ఒక మహిళతో సహా ఏడుగురు మరణించారు..మరో 30 మంది గాయపడ్డారు. ఘట్బేసి ప్రాంతంలో ఖాట్మండుకు వెళ్తున్న ప్యాసింజర్ బస్సు పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో త్రిశూలి నదిలో పడిపోయింది. ధాడింగ్ జిల్లా పోలీసు కార్యాలయానికి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) గౌతమ్ కెసి ప్రకారం, ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా కనీసం ఏడుగురు మరణించారని ధృవీకరించారు. మరో 30 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారని తెలిపారు. ఈ వ్యక్తులను నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు దళం, నేపాల్ సైన్యంతో పాటు స్థానిక ప్రజలు రక్షించారు.
Read Also:Off The Record : T-Congress అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చిందా? లిస్ట్లో ఎవరున్నారు?
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
గాయపడిన వారిని రక్షించామని, స్థానిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసిన తర్వాత, తదుపరి చికిత్స కోసం ఖాట్మండుకు తీసుకెళ్లామని గౌతమ్ కెసి చెప్పారు. మృతులను ఇంకా గుర్తించలేదు. బస్సు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. బస్సు నదిలో పడి ప్రయాణికులకు గాయాలవడాన్ని బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాయుధ పోలీసు బలగాలు, చిట్వాన్లోని కురింతర్లోని డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ స్కూల్కు చెందిన బృందం కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నట్లు నివేదిక పేర్కొంది.
Read Also:Off The Record : TDPలో కాలు పెట్టిన రోజే Gummanur Jayaram కాకరేపుతున్నారా..?
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..