NTV Telugu Site icon

Floods In Nepal: భారీ వరదలు.. 112 మంది మృతి.. కొట్టుకుపోయిన వందలాది మంది!

Floods

Floods

Floods In Nepal: నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు, అలాగే కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 112 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 60 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో వందలాది మంది గల్లంతయ్యారు. గురువారం నుంచి నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విపత్తు అధికారులు ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేశారు.

KBR Park: కేబీఆర్‌ చుట్టూ ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌.. త్వరలో అండర్‌పాస్‌లు, ప్లైఓవర్ల నిర్మాణం..

నేపాల్ పోలీసు డిప్యూటీ అధికార ప్రతినిధి బిశ్వ అధికారి ప్రకారం, వర్షం కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఖాట్మండు లోయ ఒకటి. ఇక్కడ ఒక్కటే ఏకంగా 34 మంది మరణించారు. ఇది కాకుండా, చాలా మంది తప్పిపోయారు. వందల కొద్దీ గాయపడ్డారు. ఖాట్మండు వ్యాలీలో 16 మంది అదృశ్యం కాగా, దేశవ్యాప్తంగా తప్పిపోయిన వారి సంఖ్య 100కి పైగా చేరుకుంది. ఇప్పటి వరకు మూడు వేల మందికి పైగా ప్రజలను రక్షించినట్లు నేపాల్ పోలీసు డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ బిశ్వా అధికారి తెలిపారు. ఇది కాకుండా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో, దేశవ్యాప్తంగా 63 చోట్ల ప్రధాన రహదారులు బ్లాక్ చేయబడ్డాయి. ఇది రవాణా వ్యవస్థను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది.

Mahalskshmi Stotram: ఈ స్తోత్రాలు వింటే అనారోగ్య సమస్యలు తొలగి సత్సంతానం కలుగుతుంది..

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి, పట్టణాభివృద్ధి మంత్రి ప్రకాష్ మాన్ సింగ్.. హోం మంత్రి, హోం కార్యదర్శి, భద్రతా సంస్థల అధిపతులు ఇంకా ఇతర మంత్రులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్‌లను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నేపాల్‌లోని అన్ని పాఠశాలలను మూడు రోజుల పాటు మూసివేయాలని, అన్ని పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.