Nepal Floods: నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్లో మెరుపు వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ఏడుగురు ఏపీ యాత్రికుల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరిలో నలుగురు సురక్షితంగా ఉన్నారని, మరో ముగ్గురి ఆచూకీ ఇంకా లభించలేదని ఏపీ ఢిల్లీ భవన్ అధికారులు మంత్రికి వివరించారు. ఆచూకీ లభించని ముగ్గురిలో కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మి ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరి ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి లోకేష్ అధికారులను సూచించారు.
ఈషా ఫౌండేషన్కు చెందిన శశికుమార్ చివరిసారిగా చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. ఆయనను గుర్తించేందుకు చైనా, నేపాల్ అధికారులతో సమన్వయం కొనసాగించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు యాత్రికులు క్షేమంగా ఉన్నారు. సురక్షితంగా ఉన్న యాత్రికులను వీలైనంత త్వరగా అక్కడి నుంచి తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. యాత్రికుల భద్రతపై భారత రాయబార కార్యాలయంతో పాటు చైనా, నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్, ఈషా ఫౌండేషన్ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ తాజా సమాచారాన్ని సేకరించాలని మంత్రి సూచించారు. ఆచూకీ లభించని ముగ్గురి కోసం ప్రత్యేకంగా సమన్వయ చర్యలు కొనసాగించాలని చెప్పారు.
Also Read
- కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
- రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
మరోవైపు నేపాల్లో చిక్కుకున్న యాత్రికులతో పాటు మానస సరోవర యాత్రకు వెళ్లిన ఏపీ వాసుల సమాచారం సేకరణను ఆర్టీజీఎస్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్లు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తెలిపారు. నేపాల్ వరదల నేపథ్యంలో ఏపీ యాత్రికుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సురక్షితంగా ఉన్న వారిని స్వస్థలాలకు తీసుకురావడంతో పాటు, ఆచూకీ లభించని ముగ్గురి జాడ కనుగొనే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగనున్నాయి.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
ట్రెండింగ్
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!