Nepal Education Revolution: విద్యార్థి సంఘాలకు షాక్.. క్యాంపస్ల నుంచి రాజకీయాలు అవుట్.. 60 రోజుల్లో ఖాళీ చేయాల్సిందే!
- పాఠశాలకు విదేశీ పేర్లు నిషేధం
- నేపాల్ విద్యావ్యవస్థలో పెనుమార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Education Revolution: నేపాల్ నూతన ప్రధాని బాలెన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం విద్యా రంగంలో చారిత్రాత్మక నిర్ణయాలతో సంచలనం సృష్టించింది. విద్యను రాజకీయాల కోరల నుంచి విముక్తి చేసి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘100 రోజుల కార్యాచరణ ప్రణాళిక’ను శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించింది.
READ ALSO: Nara Lokesh: కార్యకర్తలే పార్టీ బలం.. టీడీపీ ఆవిర్భావ సభలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు!
Also Read
- PM Modi: సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో మోడీ హైలెవల్ మీటింగ్.. అజెండాపై ఉత్కంఠ
- 7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
- Cyberabad Police: కాసేపట్లో భారీ వర్షాలు.. ఐటీ ఉద్యోగులు, ప్రజలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు
- Indian Railways: RAC టికెట్కు పూర్తి ఛార్జీ ఎందుకు?.. అసలు కారణం చెప్పిన రైల్వే శాఖ
రాజకీయ రహిత క్యాంపస్లే లక్ష్యం..
విద్యాసంస్థలు ఇకపై విజ్ఞాన కేంద్రాలుగా మాత్రమే విరాజిల్లాలని, రాజకీయ వేదికలుగా మారకూడదని బాలెన్ మంత్రివర్గం స్పష్టం చేసింది. ప్రధానంగా రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్న విద్యార్థి సంఘాలను విద్యాసంస్థల నుంచి పూర్తిగా నిషేధించింది. రాబోయే 60 రోజుల్లోగా అటువంటి సంఘాల కార్యాలయాలను, నిర్మాణాలను విద్యా ప్రాంగణాల నుంచి తొలగించాలని ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. పార్టీ రాజకీయాలకు బదులుగా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ‘విద్యార్థి మండలి’ (వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్) వంటి రాజకీయేతర యంత్రాంగాలను 90 రోజుల్లోగా ఏర్పాటు చేయనున్నారు.
కార్యాచరణ ప్రణాళికలోని 5 కీలక అంశాలు ఇవే..
* విద్యార్థి రాజకీయాలపై నిషేధం: పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో రాజకీయ పార్టీల అనుబంధ సంఘాల కార్యకలాపాలపై తక్షణ నిషేధం విధించారు.
* విదేశీ పేర్ల తొలగింపు: ఆక్స్ఫర్డ్, పెంటగాన్, సెయింట్ జేవియర్స్ వంటి విదేశీ పేర్లతో కొనసాగుతున్న విద్యాసంస్థలు ఇకపై తమ పేర్లను ‘అసలైన నేపాలీ పేర్లు’గా మార్చుకోవాల్సి ఉంటుంది.
* పరీక్షలు లేని బాల్యం: 5వ తరగతి వరకు విద్యార్థులకు సాంప్రదాయ పరీక్షలను రద్దు చేశారు. వారి ప్రగతిని అంచనా వేయడానికి ‘ప్రత్యామ్నాయ మూల్యాంకన విధానాన్ని’ అమలు చేస్తారు.
* పౌరసత్వ నిబంధన తొలగింపు: పట్టభద్రత కోసం నేపాల్ పౌరసత్వం తప్పనిసరి అనే నిబంధనను ఎత్తివేశారు. దీనివల్ల పత్రాల సమస్యతో ఏ విద్యార్థి చదువు ఆగిపోకుండా భరోసా కల్పించారు.
* సకాలంలో ఫలితాలు: రాజకీయ జోక్యం వల్ల పరీక్షల ఫలితాల్లో జరుగుతున్న జాప్యాన్ని అరికట్టేందుకు, ఇకపై అకడమిక్ క్యాలెండర్ ప్రకారం కచ్చితంగా ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
విద్యా క్యాలెండర్ సక్రమంగా లేకపోవడం వల్ల వేలాది మంది నేపాలీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వలస వెళ్తున్నారు. బాలెన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని పెంచి, విద్యార్థుల వలసలను తగ్గిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విప్లవాత్మక మార్పులతో నేపాల్ విద్యా రంగం కొత్త పుంతలు తొక్కనుందని చెబుతున్నారు.
READ ALSO: Korukonda Crime: కిలాడి లేడీ.. ఇన్సూరెన్స్ కోసం క్రైమ్ డ్రామా, చివరలో ట్విస్ట్!
తాజావార్తలు
-
PM Modi: సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో మోడీ హైలెవల్ మీటింగ్.. అజెండాపై ఉత్కంఠ
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Khalifa: ‘ఖలీఫా’ నుంచి బిగ్ అప్డేట్.. మోహన్లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
-
Mohammed Shami: మరో పిడుగులాంటి వార్త.. ఇక మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్!
-
Explainer: చట్టం పోలీసులకు చుట్టమా? శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అమాయకులు ఎలా బలైపోతున్నారు?
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?