Neom: ప్రాజెక్టు అడ్డుపడ్డ వారిని చంపేయండి.. సౌదీ అరేబియా కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌదీ అరేబియా డ్రీమ్ ప్రాజెక్టు నియోమ్. ఆ ప్రాజెక్టుకు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీని నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సహకరించకపోతే చంపేయమని చెప్పింది. ఈ విషయాన్ని ఆ దేశ దళాల్లో పనిచేసిన కర్నల్ రభిహ్ ఎలెన్జీ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. గతేడాది యూకేకు శరణుకోరి వచ్చిన ఆయన.. తాజాగా నియోమ్ స్మార్ట్ సిటీ నిర్మాణం విషయంలో సౌదీ పాలకులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో చెప్పుకొచ్చారు. సౌదీ అరేబియాలో పెట్రోల్ నిల్వలు క్రమంగా తగ్గతున్నాయి. ప్రపంచం కూడా చమురు నుంచి గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా మళ్లుతోంది. సౌదీ ఆదాయానికి గండిపడే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అక్కడి పాలకులు దేశాన్ని పర్యాటక ప్రదేశం, గ్లోబల్ హబ్గా తీర్చి దిద్దేలా చేపట్టిందే ‘నియోమ్’ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు రూపొందించారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మానసపుత్రికగా ఈ ప్రాజెక్టును భావిస్తున్నారు.
READ MORE: Election Commission: డీబీటీ పథకాల అమలు.. సీఎస్కు ఈసీ కీలక ఆదేశాలు..
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ఈ ప్రాజెక్టుకు 500 బిలియన్ డాలర్ల బడ్జెట్ను కేటాయించారు. ఎర్ర సముద్ర తీరంలో మొత్తం 26,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 రకాల రీజియన్లను నిర్మించనున్నారు. 2030 నాటికి ఇక్కడి జనాభా 20 లక్షలకు చేరుకోవచ్చు. ఇక ది లైన్ ప్రాజెక్టును 100 మీటర్ల ఎత్తులో 200 మీటర్ల వెడల్పుతో 170 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్నారు. ఇందులో దాదాపు 90 లక్షల మంది నివసించవచ్చని చెబుతున్నారు. ఈ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి ది లైన్ ప్రాజెక్టు 2030 నాటికి కేవలం 2.4 కిలోమీటర్ల మేరకే నిర్మాణం పూర్తవుతుందనే అంచనాలున్నాయి. దీని పనుల్లో ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ ప్రాజెక్టుకు చాలా భూసేకరణ అవసరం. దీంతో మూడు గ్రామాలను ఖాళీ చేసేందుకు 2020లో సౌదీ బలగాలు తీవ్రంగా యత్నించి విజయం సాధించాయి. ఇక్కడి ప్రజలు హువైటీ తెగకు చెందినవారు. అప్పట్లో అబ్దుల్ రహీం అల్ హువైటీ అనే వ్యక్తి తన భూమిలోకి అధికారులను రానీయలేదు. దీంతో అతడిని మర్నాడే దళాలు కాల్చేశాయి. ఆ తర్వాత జరిగిన ఆందోళనలకు సంబంధించి మొత్తం 47 మంది గ్రామస్థులను ఉగ్ర నేరాలపై అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు ఎవ్వరు అడ్డు వచ్చినా సహించేది లేదని ఆ దేశం వెల్లడించింది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!