NEET Controversy: “రాజీనామాతో నా కూతురు తిరిగి రాదు.. దోషులను ఉరి తీయండి”.. నీట్ బాధితురాలి తల్లి ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Controversy: ఏ నిర్ణయం కూడా తన కూతురిని తిరిగి తీసుకురా లేదని.. కానీ న్యాయం జరుగుతుందనే తాను ఎదురు చూస్తున్నానని ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థిని తల్లి తెలిపారు. నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన దోషులకు ఉరిశిక్ష మాత్రమే సరైన శిక్ష ఆ తల్లి ఆవేదనతో డిమాండ్ చేసింది. విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ, దానివల్ల తమకేం ఒరుగుతుందని మాతృమూర్తి నీలం చతుర్వేది ప్రశ్నించారు. పేపర్ లీక్కు కారణమైన అసలు దోషులను ఉరితీయాలని ఆమె పట్టుబట్టారు. ఆమె కుమార్తె ఆకాంక్ష చతుర్వేది (18) ఈ ఏడాది మే 20న నాగ్పూర్లో ఆత్మహత్యకు పాల్పడింది. నీట్ పరీక్ష రద్దు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆకాంక్ష, “మరోసారి పరీక్ష రాసే ధైర్యం నాకు లేదు” అని సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది.
తన కుమార్తె మరణంపై స్పందిస్తూ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమకు సంతృప్తి లభించలేదని, కేవలం రాజీనామాతో బాధ్యత ముగిసిపోదని నీలం వ్యాఖ్యానించారు. విద్యార్థులు చేస్తున్న పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నామని, పేపర్ లీక్తో లక్షలాది మంది భవిష్యత్తుతో ఆడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, వారికి మరణశిక్ష విధించాలని కోరారు. మధ్యప్రదేశ్కు చెందిన ఆకాంక్ష కుటుంబం, నీట్ కోచింగ్ కోసం నాగ్పూర్ వెళ్లింది. మే 3న జరిగిన పరీక్షను ఎంతో బాగా రాశానని, 650కి పైగా మార్కులు వస్తాయని ఆకాంక్ష కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ లీకేజీ కారణంగా పరీక్ష రద్దు కావడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. తినడం, మాట్లాడటం మానేసి డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆమె తండ్రి చిన్న కమతంలో వ్యవసాయం చేస్తూ, నాగ్పూర్లో వంటమనిషిగా పనిచేస్తూ కూతురి చదువు కోసం అప్పులు చేశారు. ప్రస్తుతం ఆయన రెండుసార్లు గుండెపోటుకు గురై, పక్షవాతంతో బాధపడుతున్నారు. “అమ్మా నాన్న, మీ కూతురు బాగా చదివి డాక్టర్ అవుతుందని మీరు నమ్మారు. కానీ నాకు మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం లేదు. మొదటి ప్రయత్నంలో మంచి మార్కులు వచ్చేవి, కానీ ఇప్పుడు మళ్లీ అంత బాగా రాస్తాననే గ్యారెంటీ లేదు. నన్ను క్షమించండి అమ్మా నాన్న.. నేను అంతా పాడుచేశాను” అని ఆకాంక్ష తన సూసైడ్ నోట్లో రాసిన భావోద్వేగ మాటలు ఆ తల్లిదండ్రులను కుంగదీస్తున్నాయి. తన కూతురు బతికి ఉంటే కుటుంబాన్ని నిలబెట్టేదని, ఇప్పుడు తమను ఎవరు చూసుకుంటారంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!