NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
- నీట్ 2026 అభ్యర్థులకు శుభవార్త
- అభ్యర్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం
- జూన్ 21న నీట్ రీటెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2026 అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) శుభవార్త అందించింది. జూన్ 21న నిర్వహించనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకునేలా.. ఉచిత ప్రయాణ సదుపాయంతో పాటు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయనుంది. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ను చూపిస్తే చాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకునేలా అవసరమైన ప్రాంతాల్లో అదనపు ప్రత్యేక బస్సులను కూడా నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రతి ఏడాది వేలాది మంది విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశం కోసం నీట్ పరీక్ష రాస్తుంటారు. ఈ నేపథ్యంలో పరీక్ష రోజు రవాణా సమస్యలు ఎదురుకాకుండా.. విద్యార్థులకు పూర్తి సహకారం అందించాలనే ఉద్దేశంతో ఏపీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడనుంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ కలిసి ఈ ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నాయి. పరీక్ష రాసే అభ్యర్థులు తమ హాల్ టికెట్ను వెంట తీసుకెళ్లి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
Also Read
- Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్పై ఫిర్యాదు!
- Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!
- Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!
- Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ ఆఫీసర్!
నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. నీట్ రీటెస్ట్ జూన్ 21న నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. రీ ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ను బ్లాక్ చేసింది. నీట్ రీటెస్ట్ జూన్ 21 కాగా.. జూన్ 22 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఎన్టీఏ సిఫార్సుల మేరకు కేంద్రం ఈ తాత్కాలిక ఆంక్షలు విధించింది.
తాజావార్తలు
-
Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్పై ఫిర్యాదు!
-
Motorola Edge 70 Pro: సగం ధరకే మోటరోలా ఎడ్జ్ 70 Pro.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీ, 8GB RAM తో ప్రీమియం డిజైన్
-
Sholay: భాష తెలియకపోయినా.. అమితాబ్ క్లాసిక్ కు ఇటాలియన్లు ఫిదా.. రాత్రి 3 వరకు 2,000 మందితో..
-
Toxic : ‘పాన్ ఇండియా స్టార్’ అనే టైటిల్ శాశ్వతం కాదు.. అది ఏ ఒక్కరి సొత్తు కాదు : యశ్
-
Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!