Neelam Bhardwaj: చరిత్ర సృష్టించిన నీలం.. డబుల్ సెంచరీ చేసిన పిన్న వయస్కురాలిగా రికార్డ్
- చరిత్ర సృష్టించిన నీలం భరద్వాజ్..
- డబుల్ సెంచరీ చేసిన పిన్న వయస్కురాలిగా రికార్డ్
- 137 బంతుల్లోనే 202 పరుగులతో అజేయంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neelam Bhardwaj Double century: ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత దేశవాళీ క్రికెట్లో ప్రస్తుతం అనేక టోర్నమెంట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. టోర్నీలో 18 ఏళ్ల యువతి చరిత్ర సృష్టించింది. లిస్ట్ A క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఉత్తరాఖండ్, నాగాలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఈ రికార్డ్ సృష్టించారు. గతంలో ఈ రికార్డు శ్వేతా సెహ్రావత్ పేరిట ఉండేది. ఈ ఏడాది ప్రారంభంలో శ్వేతా సెహ్రావత్ కూడా డబుల్ సెంచరీ చేసింది. అయితే, తాజాగా భారత క్రికెట్లో ఉత్తరాఖండ్ క్రికెటర్ నీలం భరద్వాజ్ లిస్ట్ A క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కురాలుగా ఆమె రికార్డు సృష్టించింది. నాగాలాండ్తో జరిగిన మ్యాచ్లో కేవలం 137 బంతుల్లోనే 202 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ ఇన్నింగ్స్ లో నీలం భరద్వాజ్ 27 ఫోర్లు, 2 సిక్సర్లు బాదింది. మూడో నంబర్లో బ్యాటింగ్ చేపట్టిన నీలం డబుల్ సెంచరీ చేసింది. లిస్ట్ ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన ఫీట్ సాధించిన భారతదేశం నుండి నీలం భరద్వాజ్ మాత్రమే రెండవ మహిళా.
Also Read: Students Missing in Vizag: ‘లక్కీ భాస్కర్’ సినిమా చూశారు.. 9వ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు..!
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
నీలం భరద్వాజ్ కంటే ముందు, ఢిల్లీ తరపున ఆడుతున్న శ్వేతా సెహ్రావత్ జనవరి 2024లో నాగాలాండ్పై డబుల్ సెంచరీ చేసింది. అప్పుడు శ్వేతా సెహ్రావత్ 150 బంతుల్లో 242 పరుగులు చేసింది. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్లో 31 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టింది. శ్వేతా సెహ్రావత్ (Shweta Sehrawat) 19 ఏళ్ల వయసులో ఈ డబుల్ సెంచరీ సాధించింది. అయితే, ఈ రికార్డును తాజాగా నీలం భరద్వాజ్ బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్లో తొలుత ఉత్తరాఖండ్ బ్యాటింగ్ చేసింది. నీలం భరద్వాజ్ ఇన్నింగ్స్ తో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 371 పరుగులు భారీ స్కోర్ చేసింది. నీలంతో పాటు, నందిని కశ్యప్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 79 బంతుల్లో 81 పరుగులు చేసింది. అలాగే కంచన్ పరిహార్ కూడా 52 బంతుల్లో అజేయంగా 53 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యానికి సమాధానంగా నాగాలాండ్ జట్టు 47 ఓవర్లలో కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. దింతో ఉత్తరాఖండ్ 259 పరుగుల భారీ తేడాతో మ్యాచ్ను గెలుచుకుంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!