Neelam Bhardwaj: చరిత్ర సృష్టించిన నీలం.. డబుల్ సెంచరీ చేసిన పిన్న వయస్కురాలిగా రికార్డ్
- చరిత్ర సృష్టించిన నీలం భరద్వాజ్..
- డబుల్ సెంచరీ చేసిన పిన్న వయస్కురాలిగా రికార్డ్
- 137 బంతుల్లోనే 202 పరుగులతో అజేయంగా..
Neelam Bhardwaj Double century: ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత దేశవాళీ క్రికెట్లో ప్రస్తుతం అనేక టోర్నమెంట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. టోర్నీలో 18 ఏళ్ల యువతి చరిత్ర సృష్టించింది. లిస్ట్ A క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఉత్తరాఖండ్, నాగాలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఈ రికార్డ్ సృష్టించారు. గతంలో ఈ రికార్డు శ్వేతా సెహ్రావత్ పేరిట ఉండేది. ఈ ఏడాది ప్రారంభంలో శ్వేతా సెహ్రావత్ కూడా డబుల్ సెంచరీ చేసింది. అయితే, తాజాగా భారత క్రికెట్లో ఉత్తరాఖండ్ క్రికెటర్ నీలం భరద్వాజ్ లిస్ట్ A క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కురాలుగా ఆమె రికార్డు సృష్టించింది. నాగాలాండ్తో జరిగిన మ్యాచ్లో కేవలం 137 బంతుల్లోనే 202 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ ఇన్నింగ్స్ లో నీలం భరద్వాజ్ 27 ఫోర్లు, 2 సిక్సర్లు బాదింది. మూడో నంబర్లో బ్యాటింగ్ చేపట్టిన నీలం డబుల్ సెంచరీ చేసింది. లిస్ట్ ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన ఫీట్ సాధించిన భారతదేశం నుండి నీలం భరద్వాజ్ మాత్రమే రెండవ మహిళా.
Also Read: Students Missing in Vizag: ‘లక్కీ భాస్కర్’ సినిమా చూశారు.. 9వ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు..!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
నీలం భరద్వాజ్ కంటే ముందు, ఢిల్లీ తరపున ఆడుతున్న శ్వేతా సెహ్రావత్ జనవరి 2024లో నాగాలాండ్పై డబుల్ సెంచరీ చేసింది. అప్పుడు శ్వేతా సెహ్రావత్ 150 బంతుల్లో 242 పరుగులు చేసింది. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్లో 31 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టింది. శ్వేతా సెహ్రావత్ (Shweta Sehrawat) 19 ఏళ్ల వయసులో ఈ డబుల్ సెంచరీ సాధించింది. అయితే, ఈ రికార్డును తాజాగా నీలం భరద్వాజ్ బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్లో తొలుత ఉత్తరాఖండ్ బ్యాటింగ్ చేసింది. నీలం భరద్వాజ్ ఇన్నింగ్స్ తో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 371 పరుగులు భారీ స్కోర్ చేసింది. నీలంతో పాటు, నందిని కశ్యప్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 79 బంతుల్లో 81 పరుగులు చేసింది. అలాగే కంచన్ పరిహార్ కూడా 52 బంతుల్లో అజేయంగా 53 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యానికి సమాధానంగా నాగాలాండ్ జట్టు 47 ఓవర్లలో కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. దింతో ఉత్తరాఖండ్ 259 పరుగుల భారీ తేడాతో మ్యాచ్ను గెలుచుకుంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!