Neelam Bhardwaj: చరిత్ర సృష్టించిన నీలం.. డబుల్ సెంచరీ చేసిన పిన్న వయస్కురాలిగా రికార్డ్
- చరిత్ర సృష్టించిన నీలం భరద్వాజ్..
- డబుల్ సెంచరీ చేసిన పిన్న వయస్కురాలిగా రికార్డ్
- 137 బంతుల్లోనే 202 పరుగులతో అజేయంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neelam Bhardwaj Double century: ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత దేశవాళీ క్రికెట్లో ప్రస్తుతం అనేక టోర్నమెంట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. టోర్నీలో 18 ఏళ్ల యువతి చరిత్ర సృష్టించింది. లిస్ట్ A క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఉత్తరాఖండ్, నాగాలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఈ రికార్డ్ సృష్టించారు. గతంలో ఈ రికార్డు శ్వేతా సెహ్రావత్ పేరిట ఉండేది. ఈ ఏడాది ప్రారంభంలో శ్వేతా సెహ్రావత్ కూడా డబుల్ సెంచరీ చేసింది. అయితే, తాజాగా భారత క్రికెట్లో ఉత్తరాఖండ్ క్రికెటర్ నీలం భరద్వాజ్ లిస్ట్ A క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కురాలుగా ఆమె రికార్డు సృష్టించింది. నాగాలాండ్తో జరిగిన మ్యాచ్లో కేవలం 137 బంతుల్లోనే 202 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ ఇన్నింగ్స్ లో నీలం భరద్వాజ్ 27 ఫోర్లు, 2 సిక్సర్లు బాదింది. మూడో నంబర్లో బ్యాటింగ్ చేపట్టిన నీలం డబుల్ సెంచరీ చేసింది. లిస్ట్ ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన ఫీట్ సాధించిన భారతదేశం నుండి నీలం భరద్వాజ్ మాత్రమే రెండవ మహిళా.
Also Read: Students Missing in Vizag: ‘లక్కీ భాస్కర్’ సినిమా చూశారు.. 9వ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు..!
Also Read
నీలం భరద్వాజ్ కంటే ముందు, ఢిల్లీ తరపున ఆడుతున్న శ్వేతా సెహ్రావత్ జనవరి 2024లో నాగాలాండ్పై డబుల్ సెంచరీ చేసింది. అప్పుడు శ్వేతా సెహ్రావత్ 150 బంతుల్లో 242 పరుగులు చేసింది. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్లో 31 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టింది. శ్వేతా సెహ్రావత్ (Shweta Sehrawat) 19 ఏళ్ల వయసులో ఈ డబుల్ సెంచరీ సాధించింది. అయితే, ఈ రికార్డును తాజాగా నీలం భరద్వాజ్ బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్లో తొలుత ఉత్తరాఖండ్ బ్యాటింగ్ చేసింది. నీలం భరద్వాజ్ ఇన్నింగ్స్ తో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 371 పరుగులు భారీ స్కోర్ చేసింది. నీలంతో పాటు, నందిని కశ్యప్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 79 బంతుల్లో 81 పరుగులు చేసింది. అలాగే కంచన్ పరిహార్ కూడా 52 బంతుల్లో అజేయంగా 53 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యానికి సమాధానంగా నాగాలాండ్ జట్టు 47 ఓవర్లలో కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. దింతో ఉత్తరాఖండ్ 259 పరుగుల భారీ తేడాతో మ్యాచ్ను గెలుచుకుంది.
తాజావార్తలు
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
-
Ola S1Z: భారత్లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
-
AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. మిర్జా రహమత్ బేగ్పై ఎంఐఎం వేటు..
-
Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
-
CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!