Hyderabad: జహీరాబాద్లో విశాల్ షిండే హత్య కేసు.. నిందితుడు నజీర్ అహ్మద్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్కు పాతబస్తీ అడ్డాగా మారింది. ఇక్కడ కత్తిపోట్లూ, గ్యాంగ్ వార్లూ సర్వసాధారణం. కొందరు మద్యం తాగి గొడవలకు దిగుతుండగా, మరికొందరు కక్షలతో కత్తులు, తల్వార్లతో దాడికి దిగుతున్నారు. అయితే పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో కాస్త ప్రశాంతంగా ఉంది. అయితే ఈ పాత బస్తీలో ఏం జరుగుతుంది..? ఏ సమయంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఊహించడం చాలా కష్టం. గత రాత్రి పాతబస్తీలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు నజీర్ అహ్మద్గా గుర్తించారు. రెండేళ్ల క్రితం జహీరాబాద్లో విశాల్ షిండే హత్య కేసులో నజీర్ అహ్మద్ నిందితుడు. విశాల్ షిండే హత్య కేసులో నసీర్ అహ్మద్ సహా 7 మంది సభ్యులు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్లో నజీర్ అహ్మద్ను దుండగులు హత్య చేశారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read also: Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్.. వైసీపీ గూటికి కీలక నేత
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్ గూడ శివాజీ నగర్ ప్రాంతానికి చెందిన విశాల్ షిండే(22) సెప్టెంబర్ 2020 -29న అదృశ్యమై హత్యకు గురైన విషయం తెలిసిందే.. కనిపించడం లేదంటూ అతని తల్లి కల్పన ఫిర్యాదు చేయడంతో 30న ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు 2020 అక్టోబర్ 1న జహీరాబాద్ అడవుల్లో విశాల్ షిండే హత్యకు గురైనట్లు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు జహీరాబాద్ ప్రాంతానికి చేరుకుని విశాల్ షిండే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసులో నజీర్ (20), జహీర్ (19), మరికొందరు జహీరాబాద్ అడవుల్లో విశాల్ను హత్య చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
TSRTC: బస్సుల్లో క్యాష్లెస్ జర్నీ..! డిజిటల్ పేమెంట్ల ద్వారా టికెట్లు
తాజావార్తలు
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
-
Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!