nayanathara surrogacy issue: కోలీవుడ్ కపుల్ నయనతార విగ్నేష్ శివన్ దంపతుల సరోగసీ వివాదం నేడు ఓ కొలిక్కి వచ్చేలా ఉంది. తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ పూర్తి చేసింది. నేడు సర్కారుకు కమిటీ సభ్యులు నివేదిక సమర్పించనున్నారు. ఇప్పుడు ఆ నివేదికలో ఏం ఉందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నయన్ – విగ్నేష్ లు అన్ని నిబంధనలు పాటించే తల్లిదండ్రులు అయ్యారా లేదా అని తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు ఆగాల్సిందే అంటున్నారు. ఇక ఇటీవలే ఈ జంట.. తమ పెళ్లి ఆరేళ్ళ క్రితమే పెళ్లి అయ్యినట్లు నిరూపించిన విషయం తెల్సిందే. సరోగసీ లీగల్ గానే జరిగినట్లు నయన్ దంపతులు చెప్తున్నారు. మరి ఆ నివేదికలో ఏం రానున్నదో చూడాలి.
Read Also: RGV Tweet On Rishi Sunak : రిషి సునాక్పై ఆర్టీవీ సంచలన ట్వీట్.. అవకాశం దొరికిందంటూ
పెళ్లైన నాలుగున్నర నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం హాట్టాపిక్గా మారింది. సరోగసి విధానంలో పిల్లలకు జన్మనివ్వడం నిబంధనలకు అనుగుణంగా జరిగిందా లేదా? ఇది చట్టబద్ధమేనా కాదా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతలుకు నోటీసులు జారీ చేసి, ఓ కమిటీని నియమించింది. దీనిపై కమిటీ సభ్యులు విచారణ పూర్తి చేశారు. ఈ క్రమంలో నయన్ దంపతులకు కమిటీ అఫిడవిట్ పంపింది. తమకు ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ అయ్యిందని అందులో పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్లో సరోగసీ కోసం అప్లై చేశామని, నిబంధనలు అతిక్రమించలేదని పేర్కొన్నారు. ఈ వివాదంపై నివేదికను ప్రభుత్వానికి అందించనున్న నేపథ్యం నివేదికలో ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి నెలకొంది. నివేదిక అందిన తరువాత సాయంత్రం ప్రెస్ మీట్ ద్వారా నివేదిక అంశాలను తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యన్ తెలుపనున్నారు.