IPL 2025: ఊసరవెల్లి అంటూ.. లైవ్ టీవీలో సిద్ధూ, రాయుడు గొడవ!
- కాంట్రవర్సీ వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో రాయుడు
- మాజీ క్రికెటర్ బంగర్కు రాయుడు కౌంటర్
- లైవ్ టీవీలో సిద్ధూతో గొడవ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు ఆటగాడు అంబటి రాయుడు కాంట్రవర్సీ వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఐపీఎల్ 2024 సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్, ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పదే పదే విమర్శలు చేసి.. ఏకంగా హత్యా బెదిరింపులకు గురయ్యాడు. ఐపీఎల్ 2025లో హార్దిక్ పాండ్యా విషయంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్కు కౌంటర్ ఇచ్చాడు. ఇది జరిగి ఓ రోజు కూడా గడవకముందే లైవ్ టీవీలో మరో మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధుతో గొడవ పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు కామెంటేటర్లుగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అంబటి రాయుడు వ్యవహరించారు. కామెంటరీలో భాగంగా రాయుడు సరదాగా మాట్లాడుతూ.. ‘సిద్ధూ టీమ్లను ఎప్పటికప్పుడు ఊసరవెల్లిలాగా మార్చుతుంటాడు’ అని అన్నాడు. అందుకు పగలపడి నవ్విన సిద్ధూ.. అంతే సరదాగా రాయుడుకు కౌంటర్ వేశాడు. ‘ఈ ప్రపంచంలో ఊసరవెల్లికి ప్రతిరూపం ఎవరైనా ఉన్నారంటే.. అది నువ్వే’ అని రిప్లై ఇచ్చాడు. దాంతో ఇద్దరూ నవ్వుకున్నారు. ఈ వీడియో నెట్టింట హల్చల్ అవుతోంది. నిత్యం కాంట్రవర్సీలో తలదూర్చే రాయుడుని నెటిజెన్స్ ఏసుకుంటున్నారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
Also Read: Rohit Sharma: ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం!
అంబటి రాయుడు భారత్ తరఫున 55 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో 1736 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు రాయుడు 204 ఐపీఎల్ మ్యాచ్లలో 4348 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?