Naveen Yadav: సెక్యులర్ నాయకుడిగా ఆశీర్వదించండి.. కాంగ్రెస్ అభ్యర్థి హాట్ కామెంట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలతో తమ కుటుంబానికి గత 40 ఏళ్లుగా అనుబంధం ఉందని, సహాయం కోసం వచ్చిన వారందరికీ అండగా నిలిచామని ఆయన తెలిపారు. అన్ని కులాలు, మతాల వారితో తమకున్న సంబంధాల కారణంగానే ప్రజలు తనను ఒక సెక్యులర్ నాయకుడిగా భావించారని అన్నారు. అందుకే 2014లో MIM పార్టీ తరఫున పోటీ చేసినా.. ప్రజలు తనకు మంచి మెజారిటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచేలా చేశారని గుర్తు చేశారు.
Gorilla Getup: కోతుల బెడదకు యువత మాస్టర్ ప్లాన్..!
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
బీజేపీ నేత బండి సంజయ్ తనను ‘నవీన్ ఖాన్’ అని సంబోధించడంపై నవీన్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బండి సంజయ్ గారూ.. ఇక్కడ మీరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే చూపించి ఓట్లు అడగండి. అంతేగానీ ఇక్కడ ఉన్న హిందువులు, ముస్లింల మధ్య మతకల్లోలాలు సృష్టించే విధంగా మాట్లాడొద్దు అని ఆయన అన్నారు. ఇక్కడ బస్తీల్లో అందరూ అన్నాతమ్ముల్లాగా కలిసి ఉంటే ఈ ప్రాంతం కబరస్థాన్ (శ్మశానం) ఎలా అవుతుందని ప్రశ్నించారు. మేం కులమతాలకతీతంగా అన్ని పండగలను కలిసి జరుపుకుంటాం. రంజాన్, క్రిస్మస్, దసరా, బతుకమ్మ, సంక్రాంతి.. అన్ని పండుగలను హిందూ, ముస్లింలు అందరం కలిసి జరుపుకుంటాం. ఇక్కడ సెక్యులర్ వాతావరణం ఉంటుంది. ఇక్కడి ప్రజలకు కులాలు, మతాల పైన ఎలాంటి ఆలోచనలు లేవని నవీన్ యాదవ్ స్పష్టం చేశారు.
Classic 650 Launch: సరికొత్త స్టైలిష్ లుక్ తో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 లాంచ్..
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీఆర్ఎస్ వాళ్ళు నన్ను రౌడీ, గూండా అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ వాళ్లు కులమతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారు. ఈ రెండు పార్టీలూ కలిసి లేనిపోని ఆరోపణలు చేస్తూ తనను ఓడగొట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత 40 ఏళ్లుగా తాము ఎక్కడా ఏ ఒక్క వసూళ్లకు కూడా పాల్పడిన దాఖలాలు లేవని.. వసూళ్లకు పాల్పడటం తమ నైజం కాదని, ఎవరినీ ఇబ్బంది పెట్టడం తమ రక్తంలోనే లేదని నవీన్ యాదవ్ అన్నారు. తాను గెలిస్తే ఎలాంటి టాక్స్లు ఉండవు. పేదోడు ప్రశాంతంగా ఉండాలనేదే మా యొక్క ఆలోచనని భరోసా ఇచ్చారు. చివరగా, జూబ్లీహిల్స్ ప్రజలు తమ ప్రాంత అభివృద్ధి, తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!