Home Remedies For Dark Spots: మెరిసే చర్మం కావాలంటే ఈ సహజ చిట్కాలు పాటించాల్సిందే!
- మెరిసే చర్మం కావాలంటే సహజ చిట్కాలు మీకోసం.
- మార్కెట్ ఉత్పత్తులపై ఆధారపడకుండా ఇంటిలో సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించడం ఆరోగ్యానికి మేలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Remedies For Dark Spots: ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన, మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. దీనికోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే ఇందులో కొన్ని రసాయన ఉత్పత్తులు ఎక్కువగా వాడటం వల్ల చర్మంపై దుష్ప్రభావాలు చూపే అవకాశముంది. అందుకే, సహజ పద్ధతులతో చర్మ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఇంటిలోనే సులభంగా లభించే పదార్థాలతో మచ్చలు, ముడతలు, చర్మసంబంధ సమస్యలను తగ్గించుకోవచ్చు. మరి అవేంటో ఒకసారి చూద్దామా..
చందనం (గంధపు) పొడి:
Also Read
- Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
గంధపు పొడి చర్మాన్ని తేమగా ఉంచి, సహజ మెరుపును అందిస్తుంది. ఇది ముఖ్యంగా టాన్ తొలగించడానికి, మొటిమల మచ్చలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక చెంచా గంధపు పొడిని రోజ్ వాటర్ లేదా దోసకాయ రసంతో మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయాలి. ముఖానికి అప్లై చేసి, పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.
Also Read: Threatening calls: మహిళా తహసీల్దార్కు బెదిరింపు కాల్స్.. మేం వస్తున్నాం.. బయటకు రండి..!
బంగాళాదుంప:
బంగాళాదుంపలో విటమిన్లు, యాంటీ-ఆక్సిడెంట్లు, పిండి పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మంపై మచ్చలను తగ్గించడంలో, అలాగే రంగును మెరిపించడంలో సహాయపడతాయి. ఇందుకోసం ఒక బంగాళాదుంపను తురుముకొని దాని రసాన్ని తీసుకోవాలి. దూది సహాయంతో ఈ రసాన్ని ముఖానికి అప్లై చేయాలి. అలా 15-20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కాకున్నా బంగాళాదుంప ముక్కలను నేరుగా ముఖంపై రాసినా చర్మానికి మేలు జరుగుతుంది.
పచ్చి పాలు:
పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది చర్మాన్ని సహజంగా నిగనిగలాడేలా మార్చడంలో సహాయపడుతుంది. ఇందుకోసం పచ్చి పాలను కాటన్ సహాయంతో ముఖంపై అప్లై చేయండి. ఆ తర్వాత 10 నుండి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి 3-4 సార్లు చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
Also Read: Priyamani: ఆయన సినిమాలో నటించడానికి అదృష్టం ఉండాలి : ప్రియమణి
పసుపు పొడి:
పసుపులో సహజమైన యాంటీ-సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం కొద్దిగా పసుపు పొడిని పాలలో లేదా నిమ్మరసంలో కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారంలో 2-3 సార్లు చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
మెరిసే చర్మాన్ని పొందడం కోసం మార్కెట్ ఉత్పత్తులపై ఆధారపడకుండా ఇంటిలో సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పై చెప్పిన సహజ చిట్కాలను పాటిస్తూ.. సమతుల్య ఆహారం తీసుకుంటూ, మళ్లీ మళ్లీ నీరు తాగడం ద్వారా ఆరోగ్యవంతమైన, కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!