CM Mamta Banarjee: 87కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని మమత ప్రభుత్వానికి వెల్ఫేర్ కమిషన్ నోటీసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Mamta Banarjee: పశ్చిమ బెంగాల్లోని 87 కులాలను సెంట్రల్ బ్యాక్వర్డ్ క్లాసెస్(OBC) జాబితాలో చేర్చాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి, సాంస్కృతిక పరిశోధనా సంస్థ డైరెక్టర్లకు నోటీసు జారీ చేసింది. నవంబర్ 3 ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు అన్ని పత్రాలతో సమన్లు పంపింది. కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ నవంబర్ 3న ఈ అంశంపై విచారణ జరుపనున్నారు. హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారి వంశపారంపర్య పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందించలేకపోయిందని కమిషన్ చెబుతోంది.
Read Also:Gold Price Today: పండగల వేళ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగ్లాదేశ్కు చెందిన ముస్లింలు, రోహింగ్యాలను ఓబీసీ రిజర్వేషన్ జాబితాలో చేర్చిందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనేక ముస్లిం కులాలకు ఓబీసీ హోదా ఇవ్వడం వెనుక బుజ్జగింపు రాజకీయాలు ఉన్నాయని, అర్హులైన వారికి రిజర్వేషన్ కల్పించాలని, బుజ్జగింపు రాజకీయాల కోసం కాదని కమిషన్ చైర్మన్ హన్సరాజ్ అహిర్ బెంగాల్ పర్యటన తర్వాత అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఓబీసీల రాష్ట్ర జాబితాలో చేర్చబడిన 87 మంది ఓబీసీల గెజిటీర్, వంశవృక్షాన్ని అందుబాటులో ఉంచాలని నోటీసులో పేర్కొన్నారు. ఇది కాకుండా గతంలో హిందువులుగా ఉండి తర్వాత ముస్లింలుగా మారిన ఓబీసీల రాష్ట్ర జాబితాలో చేర్చబడిన ఓబీసీలందరి గెజిటీర్లు, వంశావళిని అందుబాటులో ఉంచాలి. ఫిబ్రవరి 2023లో కోల్కతాలో జరిగిన జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ సమీక్షా సమావేశంలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర జాబితాలో చేర్చబడిన 179 ఓబీసీ కులాలలో 118 ముస్లిం ఓబీసీ కులాలు మాత్రమే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా అందించారు. అందులో 61 హిందూ ఓబీసీ కులాలు.
Read Also:Medigadda Barrage: కుంగిన మేడిగడ్డ లక్ష్మీబ్యారేజ్.. ఆందోళనలో స్థానికులు
తాజావార్తలు
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!