DD News: డీడీ న్యూస్ లోగో కలర్ మారింది.. ఏ రంగులోకి అంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు న్యూస్ ఛానల్ అంటే గుర్తొచ్చేది దూరదర్శనే. 20వ శతాబ్దం వరకు డీడీ న్యూసే అందరికీ దిక్కుగా ఉండేంది. వార్తలు చూడాలంటే డీడీ న్యూస్నే చూసేవారు. ఇప్పుడెందుకు దీని సంగతి అంటారా? ప్రస్తుతం ఇది కొత్త రూపాన్ని సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే డీడీ న్యూస్ రంగు మార్చుకుంది. మొన్నటిదాకా ఎరుపు రంగులో ఉండే డీడీ లోగోను.. ఇప్పుడు కాషాయ రంగులోకి మారుస్తూ డీడీ యాజమాన్యం ఏప్రిల్ 16న నిర్ణయించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటనలో తెలియజేసింది.
ఇది కూడా చదవండి: Premalu 2: యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ రెడీ అవుతోంది.. రిలీజ్ ఎప్పుడంటే?
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
మునుపెన్నడూ లేని విధంగా వార్తల ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. సరికొత్త DD వార్తలను మీ ముందుకు తెస్తున్నామని పేర్కొంది. మాకు ధైర్యం ఉంది… వేగంపై కచ్చితత్వం, ఆరోపణలపై వాస్తవాలు, సంచలన నిజాలు ప్రజల ముందుకు తెస్తామని డీడీ న్యూస్ ఓ పోస్ట్లో వెల్లడించింది. ఈ మేరకు కొత్త రూపాన్ని వీడియో ద్వారా చూపించింది.
ఇది కూడా చదవండి: Bridge Collapse: పూంచ్ సెక్టార్లో గాలివాన దెబ్బకి కూలిన బ్రిడ్జ్..
దూరదర్శన్ 1959 సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. 1965లో దూరదర్శన్ న్యూ ఢిల్లీ వార్తలను ప్రసారం చేసింది. 1975 నాటికి డీడీ సేవలను ముంబై, అమృత్సర్ సహా ఏడు నగరాలకు విస్తరించింది. 1976 ఏప్రిల్ 1న ఇది సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక విభాగం కిందకు వచ్చింది. 1982లో దూరదర్శన్ నేషనల్ బ్రాడ్కాస్టర్ అయింది. 1982లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంతో దూరదర్శన్ కలర్ వెర్షన్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఢిల్లీలో 1982 ఆసియా క్రీడలు కలర్ టెలికాస్ట్ జరిగింది. ప్రస్తుతం దూరదర్శన్ 6 జాతీయ ఛానెల్లు, 17 ప్రాంతీయ ఛానెల్లను కలిగి ఉంది. జాతీయ ఛానెల్లలో DD నేషనల్, ఇండియా, కిసాన్, స్పోర్ట్స్, ఉర్దూ, భారతి ఉన్నాయి. మరోవైపు DD అరుణ్ప్రభ, బంగ్లా, బీహార్, చందన, గిర్నార్, మధ్యప్రదేశ్, మలయాళం, నార్త్ ఈస్ట్, ఒడియా, పొధిగై, పంజాబీ, రాజస్థాన్, సహ్యగిరి, సప్తగిరి, ఉత్తర ప్రదేశ్, యాదగిరి, కాశీర్ అనే ప్రాంతీయ ఛానల్లను కలిగి ఉంది.
While our values remain the same, we are now available in a new avatar. Get ready for a news journey like never before.. Experience the all-new DD News!
We have the courage to put:
Accuracy over speed
Facts over claims
Truth over sensationalismBecause if it is on DD News, it… pic.twitter.com/YH230pGBKs
— DD News (@DDNewslive) April 16, 2024
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..