నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోగా దూసుకుపోతున్నారు. వరుస హిట్లతో ఊపు మీదున్న ఆయన వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే మరో సినిమాను సెట్స్పైకి తీసుకెళ్తుంటారు. కానీ బాలయ్య మాత్రం రూటు మార్చి ఒకేసారి రెండు సినిమాలను సమాంతరంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం బాలయ్య తన 111వ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముంబై బ్యాక్డ్రాప్లో ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా సెట్స్పై ఉండగానే బాలయ్య మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెసేజ్ ప్లస్ మాస్ సినిమాల స్పెషలిస్ట్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. మే 1న ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్తో ‘దేవర 2’ షూటింగ్కు గ్యాప్ ఉండటంతో, ఆ సమయంలోపు బాలయ్య సినిమాను పూర్తి చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారు. వేసవి ముగిసిన వెంటనే బాలయ్య అటు గోపీచంద్ మలినేని చిత్రాన్ని ఇటు కొరటాల శివ చిత్రాన్ని ఒకేసారి సమాంతరంగా షూట్ చేయబోతున్నారు. అంటే ఒక షెడ్యూల్ ఒక దర్శకుడితో మరో షెడ్యూల్ ఇంకో దర్శకుడితో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఒక దానిని 2027 సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ వార్తతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు
