Hyderabad: హైదరాబాద్ నాంపల్లిలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి గురైన ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ను పోలీసులు సీజ్ చేశారు. ఎఫ్ ఎస్ఎల్ ల్యాబ్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం మరోసారి క్లూస్ టీం ఎస్బి తనిఖీలు కొనసాగుతున్నాయి.. అగ్ని ప్రమాద సమయంలో ఎవరున్నారనే దానిపై ఎస్బి ఆరా తీస్తోంది.. కార్యాలయంలోని సీసీ కెమెరాలు ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్ లో ప్రమాదం జరిగింది.. ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు లాప్టాప్, పెన్ డ్రైవ్ దగ్ధం అయినట్లు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన FIR NTV చేతికి చిక్కింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
READ MORE: T20 World Cup 2026: భారత్- పాక్ మ్యాచ్పై అనిశ్చితి.. ఐసీసీకి, పాకిస్తాన్కి ఎంత నష్టం జరగనుందంటే..?
FIRలోని ముఖ్య అంశాలు.. నిన్న నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లో అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 10:08 గంటలకు కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాపర్టీ రూమ్లో దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది. క్లాస్-IV ఉద్యోగి సాయి కృష్ణ మంటలను గమనించాడు. వెంటనే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఉదయం 10:25 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు ఇన్స్పెక్టర్.. అప్పటికే ఫైర్ ఎక్స్టింగ్విషర్లతో పొగను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఉదయం 10:30 గంటలకు అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరింది. భవనంలోని అన్ని ఎంట్రీ ఎగ్జిట్ మార్గాల వివరాలు ఫైర్ సిబ్బందికి అందజేశారు. మధ్యాహ్నం 1:30 గంటలకు మంటలు, పొగ పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అనాలిసిస్ ఛాంబర్, సర్వర్ రూమ్లకు నష్టం వాటిల్లింది. HRD హాల్, ఫర్నిచర్, పరికరాలు సహా ఇతర గదులకూ నష్టం జరిగింది. ప్రాణనష్టం, గాయాలు ఏవీ లేవు.
READ MORE: Former ICC Chairman Ehsan Mani: “మాట్లాడండి.. బయపెట్టకండి”.. అలా ఐతే భారత్-పాక్ మ్యాచ్ కష్టమే!
