Gaddar Awards 2025: యువసామ్రాట్ నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచిన ‘తండేల్’ చిత్రం అవార్డుల వేటలోనూ దూసుకుపోతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గద్దర్ అవార్డ్స్ 2025’లో ఈ చిత్రానికి రెండు కీలక అవార్డులు దక్కాయి. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రంలో ఒక మత్స్యకారుడి పాత్రలో నాగచైతన్య ఒదిగిపోయి నటించారు. ఆయన చూపిన అద్భుతమైన నటనకు, భావోద్వేగపూరితమైన ప్రదర్శనకు గానూ ‘ఉత్తమ నటుడు’ (Best Actor) అవార్డు లభించింది. నాగచైతన్య కెరీర్లో ఒక స్టేట్ అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
READ ALSO: Crime: మాజీ భార్యకు గిఫ్ట్ ఇవ్వడానికి స్నేహితుడినే చంపేశాడు..
నటనతో పాటు కథా పరంగా కూడా ‘తండేల్’ తన ముద్ర వేసింది. మానవత్వం, ఐక్యత, దేశభక్తి వంటి అంశాలను సమతుల్యం చేస్తూ సాగిన ఈ సినిమాకు ‘ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం’గా అవార్డు దక్కింది. ముఖ్యంగా జాతీయ జెండా ఆవిష్కరణ, సాంస్కృతిక మూలాలను చూపించిన విధానానికి ఈ గుర్తింపు లభించింది. అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. గత ఏడాది ‘పుష్ప 2’ చిత్రానికి అల్లు అర్జున్ అవార్డు అందుకోగా, ఇప్పుడు అదే సంస్థ నుంచి నాగచైతన్య ఈ గౌరవాన్ని అందుకోవడం గమనార్హం.
గద్దర్ అవార్డ్స్ గురించి..
తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్న నంది అవార్డుల స్థానంలో సినిమా రంగాన్ని గౌరవించేందుకు ‘గద్దర్ అవార్డ్స్’ను ప్రవేశపెట్టింది. కళాకారుల ప్రతిభను ప్రోత్సహించే ఈ వేదికపై ‘తండేల్’ చిత్రానికి రెండు అవార్డులు రావడం అటు చిత్ర యూనిట్కు, ఇటు అక్కినేని అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది.
READ ALSO: Varalaxmi Sarathkumar: సాయి మాధవ్ బుర్రా.. ‘రేప్’ వ్యాఖ్యలపై వరలక్ష్మీ సీరియస్!