Naga Chaitanya : నాగచైతన్య తర్వాత సినిమా కోసం బాలీవుడ్ విలన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెలలో పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున విడుదల కానుంది. అయితే, ఈ సినిమా విడుదలకు ముందే నాగ చైతన్య తన తదుపరి సినిమాను లైన్ లో పెట్టుకున్నట్లు తెలిసింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నాగ చైతన్య చేయబోయే తదుపరి సినిమాకు మేకర్స్ క్రేజీ టైటిల్ ను ఆలోచిస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి.
Read Also:Eknath Shinde: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి సహకరించాలని కార్యకర్తలకు శివసేన పిలుపు
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
నాగ చైతన్య తన తదుపరి సినిమాను ‘విరూపాక్ష’ ఫేమ్ దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ విషయంలో ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ తో షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాయి. ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించబోతున్నారు. ఈ చిత్రాన్ని 2025 చివరిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ను మేకర్స్ ఇంకా ఖరారు చేయలేదు.
Read Also:AP Crime: ప్రేమ పేరుతో కూతురికి వేధింపులు.. టెన్త్ విద్యార్థిపై కత్తితో దాడి చేసిన తండ్రి..
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘వృషకర్మ’ అనే టైటిల్ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కార్తీక్ చివరి చిత్రం ‘విరూపాక్ష’ అనే పవర్ఫుల్ టైటిల్తో ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ సినిమాను ఇప్పటికే అధికారికంగా ప్రారంభించారు. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్గా ఓ బాలీవుడ్ నటుడు నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉండనుందని.. అందుకోసం బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాత్సవ ఈ పాత్రకు పర్ఫెక్ట్గా సరిపోతాడని కార్తీక్ దండు భావిస్తున్నాడట. దీని కోసం ఆయన్ను సంప్రదించడం కూడా జరిగినట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!