Bihar : లక్షల్లో గిప్ట్ ఇచ్చిన లవర్ బాయ్.. చేతికి చిక్కగానే చెక్కేసిన ప్రియురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar : బీహార్లోని ముజఫర్పూర్లో ఓ వింత ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఈ కథ విని సామాన్యులే కాదు, పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇక్కడ ఓ యువకుడు తన ప్రియురాలికి లగ్జరీ కారు, ఐఫోన్ వంటి ఖరీదైన బహుమతులు ఇచ్చాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బహుమతి అందుకొని ఉద్యోగంలో చేరిన ప్రియురాలు ఇప్పుడు యువకుడి ఫోన్ కూడా ఎత్తడం లేదు. యువకుడి నంబర్ను అతని స్నేహితురాలు బ్లాక్ లిస్టులో పెట్టింది. ఇప్పుడు ప్రేమికుడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. అతను తన లవర్ కు నిరంతరం కాల్ చేస్తున్నానని, అయితే తన గర్ల్ ఫ్రెండ్ మాత్రం రిఫ్లై ఇవ్వడం లేదని వాపోయాడు. ప్రియురాలి వ్యవహారంతో కలత చెందిన ప్రేమికుడు పోలీసులను ఆశ్రయించాడు. తన గర్ల్ఫ్రెండ్ను కలవడానికి సహాయం చేయమని పోలీసులను అభ్యర్థిస్తున్నాడు.
Read Also:Medaram Jathara: మేడారంలో గవర్నర్.. వనదేవతలను దర్శించుకున్న తమిళిసై
Also Read
- CM Convey: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
- Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
- Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
ఈ అద్భుతమైన వింత ప్రేమ కథ ప్రస్తుతం ముజఫర్పూర్లో చర్చనీయాంశమైంది. ఈ షాకింగ్ కేసు జిల్లాలోని ముసహరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రియుడు ముసహరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామం కాగా, ప్రియురాలు సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నివాసి. ప్రియురాలిపై పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో యువకుడు తన ప్రియురాలికి ఇచ్చిన కారు, ఐఫోన్, ఇతర వస్తువులకు ఇప్పటికీ ఈఎంఐ చెల్లిస్తున్నట్లు తెలిపాడు. యువకుడు బీఈడీ కళాశాలలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతడి గర్ల్ ఫ్రెండ్ పాట్నాలోని హెల్త్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్పై పనిచేస్తుండగా.. నాలుగేళ్ల క్రితం ఇద్దరూ కలిసి బీఈడీ చదివేవారని బాధిత యువకుడు తెలిపాడు. ఈ సమయంలో వారిద్దరూ స్నేహితులుగా మారారు. గంటల తరబడి మాట్లాడుకోవడం ప్రారంభించారు. దీని తర్వాత యువతి యువకుడిని ఏది అడిగినా కొని ఇచ్చేవాడు.
Read Also:Bhimaa Movie: గోపీచంద్ ‘భీమా’ ట్రైలర్ రిలీజ్కు ముహూర్తం ఖరారు!
కొన్ని నెలల క్రితం తాను ఈఎంఐపై ఐఫోన్, ఖరీదైన కారు కొని ప్రియురాలికి ఇచ్చానని యువకుడు చెప్పాడు. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చినందుకు రూ.20 లక్షలు అప్పు అయిందని యువకుడు చెప్పాడు. అతను ప్రతి నెలా దాని EMI చెల్లిస్తున్నాడు. ఇక్కడ అతని స్నేహితురాలు తనను బ్లాక్ మెయిలింగ్ కేసులో ఇరికిస్తానని బెదిరిస్తోంది. ఈ విషయమై కాజీమహమ్మద్పూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు యువకుడిని ముషారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు.
తాజావార్తలు
-
CM Convey: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!