Muthireddy Yadagiri Reddy: దేవుడా మూడోసారి కూడా కేసీఆరే సీఎం కావాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లాలోని చేర్యాలలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ మూడో సారి సీఎం కావాలని కొమురవెళ్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మధ్య నియోజకవర్గంలో ఉద్యమం, పోరాటాలు తెలియని కార్పోరేట్ శక్తులు అధికార, డబ్బు బలంతో నీచపు రాజకీయాలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను ఉన్నప్పటికీ నా కుటుంబ సమస్యలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
Read Also: Shraddha Das : చీర కట్టులో మెరిసిన శ్రద్ధా.. బిగవైన అందాలతో రెచ్చగొడుతుందిగా..
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
నేను సీఎం కేసిఆర్ తోనే ఉంటా.. ప్రగతి భవన్లోనే ఉంటానని చెబుతూ నియోజకవర్గ కార్యకర్తలను మభ్య పెట్టే ప్రయత్నం పల్లా రాజేశ్వర్ రెడ్డి చేస్తున్నాడని ముత్తిరెడ్డి ఆరోపించాడు. తానే గొప్ప మేధావి, తన మేధస్సుతోనే వీఆర్ఏలకు విధులు, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసినరు అని చెప్పుకుని తిరిగే నీవ్వు ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నావు అని ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి ప్రశ్నించారు. పందికొక్కు మాదిరి దోచిన డబ్బుతో రాజకీయాలు చేయాలని చేస్తున్నావ్.. నువ్వు నడుపుతున్న కాలేజీ ఎవరిది, ఆడబిడ్డ పేరున ఉన్న కాలేజీని కబ్జా పెడితే.. నీ అక్క డిప్రెషన్ లోకి పోయింది నిజం కాదా అని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు.
Read Also: CM YS Jagan: నామినేట్ పోస్టుల ఎంపిక కసరత్తుకు బ్రేక్..? పాతవారే కొనసాగింపు..!
ఆడబిడ్డ ఆస్తిని ఆక్రమించిన నీకు తగిన శాస్తి జరుగుతది.. నేనే ముఖ్యమంత్రికి అడ్వైజ్ చేస్తున్న అని చెప్పడం సిగ్గు చేటు.. మంత్రి హరీష్ రావు సైతం సీఎం కేసిఆర్ సారథ్యంలో పనిచేస్తున్న అని చెబుతారు.. అలాంటి నువ్వు సీఎం కేసిఆర్ కు అన్నిటిలో అడ్వైజ్ చేస్తానంటూ అహంకారపు మాటలు మాట్లాడ్తవా అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. ఈ అహంకారపు మాటలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయనే భావనతో మాట్లాడాల్సి వస్తుంది.. సిట్టింగ్ ఎమ్మెల్యేను ఉన్నప్పటికీ స్టేషన్ ఘనపూర్ లో పార్టీ కార్యకర్తలతో ఎలా మీటింగ్ పెడతావు.. రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే అసలు మండలాలు, గ్రామాలు, ఎక్కడ ఉంటాయి తెల్వదు అని పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!