హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్’ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. నగర జీవనాడి అయిన మూసీ, ఈసా నదుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని.. అయితే ప్రజల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT), సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. నదుల ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్ అత్యంత కీలకం. ఈ పరిధిలో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు ఉండకూడదనే నిబంధనను ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయనుంది. నది ప్రవాహానికి అడ్డంకులుగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడం ద్వారా భవిష్యత్తులో వరద ముప్పును నివారించడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.
Also Read:LPG Cylinder Booking Rules Changed: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బుకింగ్ రూల్స్ మారాయ్..
ఈ క్రమంలో ఇళ్లు కోల్పోతున్న పేదలను ప్రభుత్వం అస్సలు వదిలేయదు. వారికి ప్రత్యామ్నాయంగా సురక్షితమైన ప్రాంతాల్లో భూమి కేటాయించడం లేదా ఆధునిక వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు. అలాగే.. వారి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తగిన పరిహారం, ఇతర సహాయ సహకారాలను అందించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Also Read:Bamruk-ud-Daula lake: హైదరాబాద్లో ప్రారంభానికి సిద్ధంగా మరో చెరువు.. సంతోషంలో స్థానికులు..
కొన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రాజెక్టును తప్పుదారి పట్టిస్తూ, ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని సీఎం మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవడం వల్ల ఎవరికీ లాభం లేదని, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. నగరాన్ని సుందరీకరించడం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. మొత్తంగా.. మూసీ పునరుజ్జీవం అనేది కేవలం పర్యావరణ పరిరక్షణకే కాకుండా, హైదరాబాద్ భవిష్యత్ అవసరాలకు అత్యంత అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
