Cyber Fraud: నిర్మలా సీతారామన్ ఫొటోతో నకిలీ ట్రేడింగ్ ప్రకటన.. రూ.1.47 కోట్లు స్వాహా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Cyber Fraud: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒక షాకింగ్ సైబర్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. షేర్ ట్రేడింగ్ స్కీమ్ ద్వారా ఓ రిటైర్డ్ డాకర్ట్ రూ.1.47 కోట్లు మోసపోయారు. ఆయన మోసపోవడానికి ప్రధాన కారణం ఓ ప్రకటన కావడం సంచలనం సృష్టించింది. బాధితుడి సోషల్ మీడియాలో ఓ నకిలీ ప్రకటన చూసి డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. ఇంతకీ ఆ రిటైర్డ్ వైద్యుడిని అంతలా ప్రలోభపెట్టిన సోషల్ మీడియా ప్రకటన ఏంటని ఆశ్చర్య పోతున్నారా..? ఇది తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే! ఎందుకంటే.. మోసగాళ్ళు ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోను ఉపయోగించి ప్రకటన సృష్టించారు. ఈ మోసం ఎలా జరిగిందో.. పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం..
READ MORE: Natasa Stankovic: కొత్త కారు కొన్న హార్దిక్ పాండ్యా మాజీ భార్య.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Also Read
- Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు.. 'ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు' నినాదంతో వేడుకలు!
- Sri Sri: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్దే కెమిస్ట్రీ అదిరిపోయిందిగా.. 'శ్రీ శ్రీ' నుంచి 'బొమ్మ బొమ్మ' సాంగ్ రిలీజ్.!
- 8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
- Team India Schedule: జింబాబ్వే సిరీస్ ముగిసింది.. టీమిండియా వాట్ నెక్స్ట్.?
పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. ముంబైకి చెందిన ఓ రిటైర్డ్ డాక్టర్ ఫేస్బుక్లో కేవలం రూ. 21,000 పెట్టుబడికి రూ. 60,000 వరకు “గ్యారంటీడ్ రిటర్న్” ఇస్తాం అనే ఓ ప్రకటనను చూశారు. ఆ ప్రకటనలో ఆర్థిక మంత్రి చిత్రాన్ని సైతం ఉపయోగించుకుని చట్టబద్ధంగా ఉన్నట్లు రూపొందించారు. బాధితుడు ఆ ప్రకటనపై క్లిక్ చేసి తన వివరాలను షేర్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే, పెట్టుబడి ప్రక్రియను ప్రారంభానికి ముందు ఓ కాల్ వచ్చింది. “మీనాక్షి” అనే మహిళ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది.UPSTOX సెక్యూరిటీస్ ప్రతినిధినని ఆ గుర్తు తెలియని యువతి పరిచయం చేసుకుంది. “SBI వెల్త్ మైండ్సెట్,” “సావెక్సా”,“రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్” అనే నకిలీ IPOలో పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించింది ఆ కిలాడీ.. బాధితుడు విడతల వారీగా మొత్తం రూ.1.47 కోట్లను బదిలీ చేశారు. మోసగాళ్ళు నకిలీ వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను సృష్టించి, బాధితుడి పెట్టుబడి రూ.6.02 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
READ MORE: Natasa Stankovic: కొత్త కారు కొన్న హార్దిక్ పాండ్యా మాజీ భార్య.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
దీంతో సంతోషం వ్యక్తం చేసిన ఆ వృద్ధుడు తన లాభాలను విత్డ్రా చేసుకోవాడానికి యత్నించాడు. ఎంత ప్రయత్నించినా విత్డ్రా కావడం లేదు. అంతేకాదు.. స్కామర్లు మరోసారి బాధితుడి కాల్ చేసి “గ్యారంటీ ఫీజు” పేరుతో మరో రూ.90 లక్షలు చెల్లించాలని కోరారు. దీంతో ఆ రిటైర్డ్ వైద్యుడికి అనుమానం వచ్చింది. తాను మోసపోతున్నట్లు గ్రహించాడు. వెంటనే ముంబై సెంట్రల్ సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో మోసగాళ్ళు నకిలీ కంపెనీలు, నకిలీ వెబ్సైట్లు, ఆర్థిక మంత్రి ఫోటోను ఉపయోగించి పెద్ద సైబర్ సిండికేట్ను నిర్వహిస్తున్నట్లు తేలింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Indane Xtralite Now: ఇండేన్ ఎక్స్ట్రాలైట్ నౌ ప్రారంభం.. తేలికైన LPG సిలిండర్, 4 గంటల్లో హోమ్ డెలివరీ.. బుకింగ్ ఇలా..
-
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు.. ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ నినాదంతో వేడుకలు!
-
Kawasaki Ninja 250: కవాసకి నింజా 250 విడుదల.. మిలమిల మెరిసే కొత్త కలర్స్, పవర్ఫుల్ ఇంజన్.. ధర ఎంతంటే?
-
Sri Sri: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్దే కెమిస్ట్రీ అదిరిపోయిందిగా.. ‘శ్రీ శ్రీ’ నుంచి ‘బొమ్మ బొమ్మ’ సాంగ్ రిలీజ్.!
-
Dhoom 4: ‘ధూమ్ 4’ నుంచి రణబీర్ కపూర్ అవుట్ ?… కొత్త హీరో కోసం యశ్ రాజ్ ఫిల్మ్స్ వేట!
ట్రెండింగ్
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!