Cyber Fraud: నిర్మలా సీతారామన్ ఫొటోతో నకిలీ ట్రేడింగ్ ప్రకటన.. రూ.1.47 కోట్లు స్వాహా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Cyber Fraud: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒక షాకింగ్ సైబర్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. షేర్ ట్రేడింగ్ స్కీమ్ ద్వారా ఓ రిటైర్డ్ డాకర్ట్ రూ.1.47 కోట్లు మోసపోయారు. ఆయన మోసపోవడానికి ప్రధాన కారణం ఓ ప్రకటన కావడం సంచలనం సృష్టించింది. బాధితుడి సోషల్ మీడియాలో ఓ నకిలీ ప్రకటన చూసి డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. ఇంతకీ ఆ రిటైర్డ్ వైద్యుడిని అంతలా ప్రలోభపెట్టిన సోషల్ మీడియా ప్రకటన ఏంటని ఆశ్చర్య పోతున్నారా..? ఇది తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే! ఎందుకంటే.. మోసగాళ్ళు ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోను ఉపయోగించి ప్రకటన సృష్టించారు. ఈ మోసం ఎలా జరిగిందో.. పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం..
READ MORE: Natasa Stankovic: కొత్త కారు కొన్న హార్దిక్ పాండ్యా మాజీ భార్య.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్కు క్వాలిఫై..
పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. ముంబైకి చెందిన ఓ రిటైర్డ్ డాక్టర్ ఫేస్బుక్లో కేవలం రూ. 21,000 పెట్టుబడికి రూ. 60,000 వరకు “గ్యారంటీడ్ రిటర్న్” ఇస్తాం అనే ఓ ప్రకటనను చూశారు. ఆ ప్రకటనలో ఆర్థిక మంత్రి చిత్రాన్ని సైతం ఉపయోగించుకుని చట్టబద్ధంగా ఉన్నట్లు రూపొందించారు. బాధితుడు ఆ ప్రకటనపై క్లిక్ చేసి తన వివరాలను షేర్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే, పెట్టుబడి ప్రక్రియను ప్రారంభానికి ముందు ఓ కాల్ వచ్చింది. “మీనాక్షి” అనే మహిళ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది.UPSTOX సెక్యూరిటీస్ ప్రతినిధినని ఆ గుర్తు తెలియని యువతి పరిచయం చేసుకుంది. “SBI వెల్త్ మైండ్సెట్,” “సావెక్సా”,“రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్” అనే నకిలీ IPOలో పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించింది ఆ కిలాడీ.. బాధితుడు విడతల వారీగా మొత్తం రూ.1.47 కోట్లను బదిలీ చేశారు. మోసగాళ్ళు నకిలీ వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను సృష్టించి, బాధితుడి పెట్టుబడి రూ.6.02 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
READ MORE: Natasa Stankovic: కొత్త కారు కొన్న హార్దిక్ పాండ్యా మాజీ భార్య.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
దీంతో సంతోషం వ్యక్తం చేసిన ఆ వృద్ధుడు తన లాభాలను విత్డ్రా చేసుకోవాడానికి యత్నించాడు. ఎంత ప్రయత్నించినా విత్డ్రా కావడం లేదు. అంతేకాదు.. స్కామర్లు మరోసారి బాధితుడి కాల్ చేసి “గ్యారంటీ ఫీజు” పేరుతో మరో రూ.90 లక్షలు చెల్లించాలని కోరారు. దీంతో ఆ రిటైర్డ్ వైద్యుడికి అనుమానం వచ్చింది. తాను మోసపోతున్నట్లు గ్రహించాడు. వెంటనే ముంబై సెంట్రల్ సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో మోసగాళ్ళు నకిలీ కంపెనీలు, నకిలీ వెబ్సైట్లు, ఆర్థిక మంత్రి ఫోటోను ఉపయోగించి పెద్ద సైబర్ సిండికేట్ను నిర్వహిస్తున్నట్లు తేలింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!