Cyber Fraud: నిర్మలా సీతారామన్ ఫొటోతో నకిలీ ట్రేడింగ్ ప్రకటన.. రూ.1.47 కోట్లు స్వాహా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Cyber Fraud: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒక షాకింగ్ సైబర్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. షేర్ ట్రేడింగ్ స్కీమ్ ద్వారా ఓ రిటైర్డ్ డాకర్ట్ రూ.1.47 కోట్లు మోసపోయారు. ఆయన మోసపోవడానికి ప్రధాన కారణం ఓ ప్రకటన కావడం సంచలనం సృష్టించింది. బాధితుడి సోషల్ మీడియాలో ఓ నకిలీ ప్రకటన చూసి డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. ఇంతకీ ఆ రిటైర్డ్ వైద్యుడిని అంతలా ప్రలోభపెట్టిన సోషల్ మీడియా ప్రకటన ఏంటని ఆశ్చర్య పోతున్నారా..? ఇది తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే! ఎందుకంటే.. మోసగాళ్ళు ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోను ఉపయోగించి ప్రకటన సృష్టించారు. ఈ మోసం ఎలా జరిగిందో.. పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం..
READ MORE: Natasa Stankovic: కొత్త కారు కొన్న హార్దిక్ పాండ్యా మాజీ భార్య.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. ముంబైకి చెందిన ఓ రిటైర్డ్ డాక్టర్ ఫేస్బుక్లో కేవలం రూ. 21,000 పెట్టుబడికి రూ. 60,000 వరకు “గ్యారంటీడ్ రిటర్న్” ఇస్తాం అనే ఓ ప్రకటనను చూశారు. ఆ ప్రకటనలో ఆర్థిక మంత్రి చిత్రాన్ని సైతం ఉపయోగించుకుని చట్టబద్ధంగా ఉన్నట్లు రూపొందించారు. బాధితుడు ఆ ప్రకటనపై క్లిక్ చేసి తన వివరాలను షేర్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే, పెట్టుబడి ప్రక్రియను ప్రారంభానికి ముందు ఓ కాల్ వచ్చింది. “మీనాక్షి” అనే మహిళ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది.UPSTOX సెక్యూరిటీస్ ప్రతినిధినని ఆ గుర్తు తెలియని యువతి పరిచయం చేసుకుంది. “SBI వెల్త్ మైండ్సెట్,” “సావెక్సా”,“రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్” అనే నకిలీ IPOలో పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించింది ఆ కిలాడీ.. బాధితుడు విడతల వారీగా మొత్తం రూ.1.47 కోట్లను బదిలీ చేశారు. మోసగాళ్ళు నకిలీ వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను సృష్టించి, బాధితుడి పెట్టుబడి రూ.6.02 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
READ MORE: Natasa Stankovic: కొత్త కారు కొన్న హార్దిక్ పాండ్యా మాజీ భార్య.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
దీంతో సంతోషం వ్యక్తం చేసిన ఆ వృద్ధుడు తన లాభాలను విత్డ్రా చేసుకోవాడానికి యత్నించాడు. ఎంత ప్రయత్నించినా విత్డ్రా కావడం లేదు. అంతేకాదు.. స్కామర్లు మరోసారి బాధితుడి కాల్ చేసి “గ్యారంటీ ఫీజు” పేరుతో మరో రూ.90 లక్షలు చెల్లించాలని కోరారు. దీంతో ఆ రిటైర్డ్ వైద్యుడికి అనుమానం వచ్చింది. తాను మోసపోతున్నట్లు గ్రహించాడు. వెంటనే ముంబై సెంట్రల్ సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో మోసగాళ్ళు నకిలీ కంపెనీలు, నకిలీ వెబ్సైట్లు, ఆర్థిక మంత్రి ఫోటోను ఉపయోగించి పెద్ద సైబర్ సిండికేట్ను నిర్వహిస్తున్నట్లు తేలింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..