Cyber Fraud: నిర్మలా సీతారామన్ ఫొటోతో నకిలీ ట్రేడింగ్ ప్రకటన.. రూ.1.47 కోట్లు స్వాహా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Cyber Fraud: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒక షాకింగ్ సైబర్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. షేర్ ట్రేడింగ్ స్కీమ్ ద్వారా ఓ రిటైర్డ్ డాకర్ట్ రూ.1.47 కోట్లు మోసపోయారు. ఆయన మోసపోవడానికి ప్రధాన కారణం ఓ ప్రకటన కావడం సంచలనం సృష్టించింది. బాధితుడి సోషల్ మీడియాలో ఓ నకిలీ ప్రకటన చూసి డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. ఇంతకీ ఆ రిటైర్డ్ వైద్యుడిని అంతలా ప్రలోభపెట్టిన సోషల్ మీడియా ప్రకటన ఏంటని ఆశ్చర్య పోతున్నారా..? ఇది తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే! ఎందుకంటే.. మోసగాళ్ళు ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోను ఉపయోగించి ప్రకటన సృష్టించారు. ఈ మోసం ఎలా జరిగిందో.. పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం..
READ MORE: Natasa Stankovic: కొత్త కారు కొన్న హార్దిక్ పాండ్యా మాజీ భార్య.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Also Read
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
- US-Iran: తాజా దాడులతో శాంతి చర్చలపై నీలినీడలు.. రగిలిపోతున్న ఇరాన్
పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. ముంబైకి చెందిన ఓ రిటైర్డ్ డాక్టర్ ఫేస్బుక్లో కేవలం రూ. 21,000 పెట్టుబడికి రూ. 60,000 వరకు “గ్యారంటీడ్ రిటర్న్” ఇస్తాం అనే ఓ ప్రకటనను చూశారు. ఆ ప్రకటనలో ఆర్థిక మంత్రి చిత్రాన్ని సైతం ఉపయోగించుకుని చట్టబద్ధంగా ఉన్నట్లు రూపొందించారు. బాధితుడు ఆ ప్రకటనపై క్లిక్ చేసి తన వివరాలను షేర్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే, పెట్టుబడి ప్రక్రియను ప్రారంభానికి ముందు ఓ కాల్ వచ్చింది. “మీనాక్షి” అనే మహిళ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది.UPSTOX సెక్యూరిటీస్ ప్రతినిధినని ఆ గుర్తు తెలియని యువతి పరిచయం చేసుకుంది. “SBI వెల్త్ మైండ్సెట్,” “సావెక్సా”,“రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్” అనే నకిలీ IPOలో పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించింది ఆ కిలాడీ.. బాధితుడు విడతల వారీగా మొత్తం రూ.1.47 కోట్లను బదిలీ చేశారు. మోసగాళ్ళు నకిలీ వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను సృష్టించి, బాధితుడి పెట్టుబడి రూ.6.02 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
READ MORE: Natasa Stankovic: కొత్త కారు కొన్న హార్దిక్ పాండ్యా మాజీ భార్య.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
దీంతో సంతోషం వ్యక్తం చేసిన ఆ వృద్ధుడు తన లాభాలను విత్డ్రా చేసుకోవాడానికి యత్నించాడు. ఎంత ప్రయత్నించినా విత్డ్రా కావడం లేదు. అంతేకాదు.. స్కామర్లు మరోసారి బాధితుడి కాల్ చేసి “గ్యారంటీ ఫీజు” పేరుతో మరో రూ.90 లక్షలు చెల్లించాలని కోరారు. దీంతో ఆ రిటైర్డ్ వైద్యుడికి అనుమానం వచ్చింది. తాను మోసపోతున్నట్లు గ్రహించాడు. వెంటనే ముంబై సెంట్రల్ సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో మోసగాళ్ళు నకిలీ కంపెనీలు, నకిలీ వెబ్సైట్లు, ఆర్థిక మంత్రి ఫోటోను ఉపయోగించి పెద్ద సైబర్ సిండికేట్ను నిర్వహిస్తున్నట్లు తేలింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
GT vs RCB: సిక్సర్ల సునామీ.. స్టేడియంలో ఆర్సీబీ శివతాండవం! గుజరాత్ టైటాన్స్ గెలవాలంటే 255 కొట్టాల్సిందే..
-
Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
-
Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
-
Astro Scam : జ్యోతిష్యం పేరుతో జేబుకు జలక్.. కొత్త సైబర్ స్కామ్ అలర్ట్.!
-
Xiaomi Mijia: మార్కెట్ లోకి విద్యుత్ ఆదా చేసే కొత్త ఏసీ.. 3 నిమిషాల్లో అదిరిపోయే కూలింగ్! ధర ఎంతో తెలుసా ?
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!