Mumbai Indians: ఎస్ఆర్హెచ్ దెబ్బకి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024 Playoffs Qualification Scenario: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ జట్టు నిష్క్రమించింది. సన్రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం నాడు జరిగిన మ్యాచ్ ఫలితంతో హార్థిక్ పాండ్యా టీమ్ టాప్-4 ఆశలు ఆవిరైపోయాయి. లక్నోను హైదరాబాద్ చిత్తు ఓడించడంతో ఈ సీజన్లో ముంబై ప్రయాణం దాదాపు ముగిసినట్లైంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ సేన విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 9.4 ఓవర్లలోనే సన్రైజర్స్ హైదరాబాద్ ఓడించింది.
Read Also: VD12 :విజయ్ దేవరకొండ బర్త్డే..స్పెషల్ అప్డేట్ వైరల్..
Also Read
- Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం 'క్లాడ్ ఫర్ లీగల్'ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
- Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
- Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
- Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
దీంతో క్యాష్ రిచ్ లీగ్ 17వ ఎడిషన్లో ఏడో విజయం నమోదు చేసిన హైదరాబాద్ జట్టు.. మొత్తంగా 14 పాయింట్లు సాధించి.. నెట్ రన్రేటు(0.406)ని మెరుగుపరచుకుని పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరుకుంది. అలాగే, మరోవైపు.. కోల్కతా నైట్ రైడర్స్ (రన్రేటు 1.453), రాజస్తాన్ రాయల్స్(రన్రేటు 0.476) 11 మ్యాచ్లు ఆడి చెరో 16 పాయింట్లతో టాప్-2లో ఉన్నాయి. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చెరో 12 పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ (రన్రేటు -0.316), లక్నో సూపర్ జెయింట్స్ (రన్రేటు -0.769) వచ్చే వారం పోటీ పడబోతున్నాయి. ఈ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధించినా 14 పాయింట్లతో పైకి వెళ్లిపోతుంది.
Read Also: MayaOne : భారీ యాక్షన్ సన్నివేశాలతో వణుకుపుట్టిస్తున్న ‘మాయావన్ ‘ టీజర్…
అయితే, మరోవైపు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (11 మ్యాచ్లు- 8 పాయింట్స్, పంజాబ్ కింగ్స్(11 మ్యాచ్లు- 8 పాయింట్లు) ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. అయితే, ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పటికే 12 మ్యాచ్లలో కేవలం 4 గెలిచి 8 పాయింట్లతో ఉంది. ఇక, మిగిలిన రెండు మ్యాచ్లు గెలిచినా మహా అయితే మొత్తంగా 12 పాయింట్లే వస్తాయి.. కాబట్టి టాప్-4లోకి ముంబై ఇండియన్స్ టీమ్ అడుగుపెట్టేందుకు అవకాశం లేదు. అలాగే, చివరి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్కు ఇంకో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేకేఆర్, రాజస్తాన్, సన్రైజర్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోగా.. ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించినట్లైంది.
తాజావార్తలు
-
Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం ‘క్లాడ్ ఫర్ లీగల్’ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
-
Kirrak Seetha: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన ఆరోపణలు!
-
IPL 2026 Playoffs Scenario: గుజరాత్ ఘన విజయం.. తగ్గిన ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఛాన్సెస్.. సీఎస్కేకు ప్లస్!
-
Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
-
Dileep Raj Death: కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!