Mumbai Indians: ఎస్ఆర్హెచ్ దెబ్బకి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024 Playoffs Qualification Scenario: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ జట్టు నిష్క్రమించింది. సన్రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం నాడు జరిగిన మ్యాచ్ ఫలితంతో హార్థిక్ పాండ్యా టీమ్ టాప్-4 ఆశలు ఆవిరైపోయాయి. లక్నోను హైదరాబాద్ చిత్తు ఓడించడంతో ఈ సీజన్లో ముంబై ప్రయాణం దాదాపు ముగిసినట్లైంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ సేన విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 9.4 ఓవర్లలోనే సన్రైజర్స్ హైదరాబాద్ ఓడించింది.
Read Also: VD12 :విజయ్ దేవరకొండ బర్త్డే..స్పెషల్ అప్డేట్ వైరల్..
Also Read
- Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
దీంతో క్యాష్ రిచ్ లీగ్ 17వ ఎడిషన్లో ఏడో విజయం నమోదు చేసిన హైదరాబాద్ జట్టు.. మొత్తంగా 14 పాయింట్లు సాధించి.. నెట్ రన్రేటు(0.406)ని మెరుగుపరచుకుని పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరుకుంది. అలాగే, మరోవైపు.. కోల్కతా నైట్ రైడర్స్ (రన్రేటు 1.453), రాజస్తాన్ రాయల్స్(రన్రేటు 0.476) 11 మ్యాచ్లు ఆడి చెరో 16 పాయింట్లతో టాప్-2లో ఉన్నాయి. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చెరో 12 పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ (రన్రేటు -0.316), లక్నో సూపర్ జెయింట్స్ (రన్రేటు -0.769) వచ్చే వారం పోటీ పడబోతున్నాయి. ఈ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధించినా 14 పాయింట్లతో పైకి వెళ్లిపోతుంది.
Read Also: MayaOne : భారీ యాక్షన్ సన్నివేశాలతో వణుకుపుట్టిస్తున్న ‘మాయావన్ ‘ టీజర్…
అయితే, మరోవైపు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (11 మ్యాచ్లు- 8 పాయింట్స్, పంజాబ్ కింగ్స్(11 మ్యాచ్లు- 8 పాయింట్లు) ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. అయితే, ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పటికే 12 మ్యాచ్లలో కేవలం 4 గెలిచి 8 పాయింట్లతో ఉంది. ఇక, మిగిలిన రెండు మ్యాచ్లు గెలిచినా మహా అయితే మొత్తంగా 12 పాయింట్లే వస్తాయి.. కాబట్టి టాప్-4లోకి ముంబై ఇండియన్స్ టీమ్ అడుగుపెట్టేందుకు అవకాశం లేదు. అలాగే, చివరి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్కు ఇంకో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేకేఆర్, రాజస్తాన్, సన్రైజర్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోగా.. ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించినట్లైంది.
తాజావార్తలు
-
Producer Narsamma: సినిమా తీసి సర్వం కోల్పోయాం.. ‘ప్రభాస్’ గారు మాకు మీరే దిక్కు: మహిళా రైతు నిర్మాత
-
Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
-
KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాలలో అనుకూలం!
-
Gautham Gambhir: ఆ విజయాలతో గంభీర్ కి ఏం సంబంధం లేదు.. నిప్పు రాజేసిన శ్రీశాంత్ కామెంట్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!