Ambani Vs Adani : ఇంతకీ భారత్లో అత్యంత సంపన్న వ్యక్తి ఎవరయ్యా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambani Vs Adani : భారత్, ఆసియాలో అత్యంత ధనవంతుడు ఎవరు అనే విషయంలో గత ఏడాదిన్నర కాలంలో అనేక మార్పులు వచ్చాయి. దేశంలోని ఇద్దరు అగ్ర సంపన్నులు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల మధ్య నంబర్ వన్ స్థానం కోసం గట్టి పోటీ నడుస్తోంది. ఇటీవల, గౌతమ్ అదానీ భారతదేశం, ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలవడంలో సక్సెస్ అయ్యాడు. అయితే కొద్ది రోజుల్లోనే ముఖేష్ అంబానీ మళ్లీ నంబర్ వన్ అయ్యాడు.
ముఖేష్ అంబానీ ప్రస్తుత నికర విలువ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రస్తుతం దేశంలోనే అత్యంత ధనవంతుడు. జనవరి 8 సోమవారం ఉదయం ఇండెక్స్లో ముఖేష్ అంబానీ మొత్తం నికర విలువ 97.5 బిలియన్ డాలర్లు. అంబానీ నికర విలువ గత 24 గంటల్లో 536 మిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ముఖేష్ అంబానీ మళ్లీ భారత్, ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ప్రపంచ స్థాయిలో ప్రస్తుతం 12వ స్థానంలో ఉన్నాడు.
Also Read
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Read Also:Telangana Free Bus: ఒరిజినల్ ఆధార్ ఉండాల్సిందే.. జిరాక్స్ చూపిస్తే బస్సు దిగాల్సిందే..
పడిపోయిన గౌతమ్ అదానీ సంపద
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ గత 24 గంటల్లో నష్టపోయారు. ప్రస్తుతం అదానీ నికర విలువ 3.09 బిలియన్ డాలర్లు తగ్గింది. ఇప్పుడు గౌతమ్ అదానీ నికర విలువ 94.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ సంపదతో అదానీ ఇప్పుడు భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా 14వ స్థానంలో ఉన్నారు.
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. గౌతమ్ అదానీ కంటే ముఖేష్ అంబానీ ముందున్నారు. ఈ జాబితా ప్రకారం ముఖేష్ అంబానీ ప్రస్తుత నికర విలువ 100.9 బిలియన్ డాలర్లు, అతను ప్రపంచంలోని 12వ అత్యంత సంపన్న వ్యక్తి. గౌతమ్ అదానీ 78.2 బిలియన్ డాలర్ల మొత్తం సంపదతో ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 16వ స్థానంలో నిలిచారు.
Read Also:Vijay-Rashmika: ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్మెంట్?
అదానీ గ్రూప్ షేర్లలో అద్భుతమైన ర్యాలీ ఆధారంగా 2022 చివరి నెలల్లో గౌతమ్ అదానీ తొలిసారిగా ముఖేష్ అంబానీని అధిగమించారు. అతను భారతదేశం, ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా 2023 సంవత్సరాన్ని ప్రారంభించాడు. ఆ సమయంలో అతని సంపద 120 బిలియన్ డాలర్లు దాటింది. దీంతో ప్రపంచంలోని టాప్-3 ధనవంతులలో ఒకటిగా నిలిచాడు. అయితే, ఆ తర్వాత జనవరి 2023లో వచ్చిన హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ అదానీకి పెద్ద నష్టాన్ని కలిగించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత, అదానీ గ్రూప్లోని అన్ని షేర్లలో భారీ పతనం జరిగింది. ఆ కారణంగా ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ టాప్-30 నుండి నిష్క్రమించాడు. గత కొన్ని నెలలుగా అదానీ గ్రూప్ షేర్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఇది గౌతమ్ అదానీ సంపదను పెంచడంలో దోహదపడింది.
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!