Mukarram Jah: హైదరాబాద్ చేరుకున్న నిజాం ప్రిన్స్ ముకర్రమ్ మృతదేహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukarram Jah: హైదరాబాద్కు చెందిన నిజాం ముకర్రం జా బహదూర్ టర్కీలోని ఇస్తాంబుల్ లో మృతిచెందారు. ఒకప్పుడు మన దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ముకర్రమ్ ఝా ఇస్తాంబుల్ లో ఒక అద్దె ఇంట్లో మృతి చెందడం బాధాకరం. మరోవైపు ఆయన మృతదేహం టర్కీ నుంచి హైదరాబాద్ కు చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. అక్కడి నుంచి చౌమొహల్లా ప్యాలెస్ కు తరలించారు.
Read Also:TSRTC: ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపిన టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్
Also Read
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
ఈరోజు ఆయన భౌతికకాయాన్ని చూడటానికి కేవలం నిజాం కుటుంబీకులు, బంధువులకు మాత్రమే అనుమతిని ఇచ్చారు. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయన పార్థివదేహాన్ని చూసేందుకు ప్రజలకు అనుమతిని ఇస్తారు. రేపు మధ్యాహ్నం ముకర్రమ్ అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. చార్మినార్ పక్కన ఉన్న మక్కా మసీదు వరకు అంతిమ యాత్ర కొనసాగుతుంది. అక్కడున్న ఆయన పూర్వీకులైన నిజాం (అసఫ్ జాహీలు)ల సమాధుల పక్కనే ముకర్రమ్ పార్థివ దేహాన్ని ఖననం చేస్తారు. శనివారం రాత్రి 89 ఏళ్ల ముకర్రమ్ ఝా ఇస్తాంబుల్ లో కన్నుమూశారు.
Read Also: State Planning Commission: పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే.. పంచాయతీరాజ్ గ్రూప్
ఉస్మాన్ అలీఖాన్ పెద్దకుమారుడైన అజమ్ కు ముకర్రం జా 1933లో జన్మించారు. ఇతడిని అందరూ ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవారు. చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్కు ఇద్దరు కుమారులు ఉన్నా.. ముకర్రం జాను 8వ నిజాంగా ప్రకటించారు. అయితే 1971లో భారత ప్రభుత్వం రాజాభరణాలు రద్దు చేసింది. దీంతో చివరి నిజాం రాజాభరణం రద్దైంది. చివరి నిజాంకు నలుగురు భార్యలు ఉన్నారు. ప్రపంచలోనే కుబేరుడిగా ఉస్మాన్ అలీఖాన్ అప్పట్లో గుర్తింపు పొందారు. ఆయన వారసుడిగా వచ్చిన ముకర్రం జా కూడా కుబేరుడయ్యారు. కానీ విలాసాలకు అలవాటు పడి.. దివాలా తీశారు. కుటుంబ విభేదాలు.. ఆస్తి వివాదాలతో ఉన్నదంతా పోగొట్టుకున్నారు. హైదరాబాద్ లో నిజాం వారసులు సైతం కోర్టుకెక్కారు. ఇక్కడి ఆస్తులను అమ్మడానికి వీల్లేదని.. కోర్టు ఆంక్షలు విధించింది. చివరికి ఇస్తాంబుల్లోని ఓ డబుల్ బెడ్రూమ్ కే చివరి నిజాం పరిమితమయ్యారు. చివరి నిజాం మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిజాం చేసిన సామాజిక సేవలకు గుర్తుగా అంత్యక్రియలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!