NTV Telugu Site icon

Mudragada Padmanabham: ఇచ్చిన మాట ప్రకారం నా పేరు మార్చుకుంటున్నా..

Mudragada

Mudragada

Mudragada Padmanabham: ఎన్నికల ప్రచార సమయంలో జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ఫైర్‌ అవుతూ వచ్చారు వైసీపీ నేత, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. అంతేకాదు.. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ను ఓడించలేకపోతే తన పేరు మార్చుకుంటానంటూ సంచలన శపథం కూడా చేశారు. ముద్రగడ పద్మనాభంగా ఉన్న నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేసిన విషయం విదితమే.. అయితే, పిఠాపురంలో జనసేనాని పవన్‌ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు.. ఈ నేపథ్యంలో.. కీలక నిర్ణయం తీసుకున్నారు ముద్రగడ పద్మనాభం.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నాను.. సవాలులో నేను ఓడిపోయాను కాబట్టి.. నా పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాను అన్నారు.

Read Also: OnePlus 12 Glacial White: మార్కెట్లోకి మరో కొత్త ఫోన్.. ఫీచర్స్ తెలుసుకుందామా..

మరోవైపు.. ప్రజల కోసం కష్టపడ్డ వైఎస్‌ జగన్ ని గౌరవించకపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ.. అయితే, నా రాజకీయ ప్రయాణం వైఎస్‌ జగన్ తోనే కొనసాగుతుందని స్పష్టం చే శారు.. జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదన్నారు. ఇక, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి శుభాకాంక్షలు తెలిపారు ముద్రగడ పద్మనాభం.. కాగా, పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించిన తర్వాత.. సోషల్‌ మీడియా వేదికగా.. ముద్రగడను ట్రోల్‌ చేస్తున్న విషయం విదితమే.. ఈ రోజు సాయంత్రమే పేరు మార్చుకునే కార్యక్రమం అంటూ.. ఓ కార్డును కూడా తయారు చేసి సోషల్‌ మీడియాలో వదిలారు కొందరు నెటిజన్లు.