Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabham: మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కిర్లంపూడిలో ముగిశాయి.. అయితే, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి పోలీసులు రావడం.. వారిని పద్మనాభం అనుచరులు అడ్డుకోవడంతో కాసేపు స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.. కానీ, తన మరణానంతరం కుటుంబ సభ్యులు అనుసరించాల్సిన విషయాలను వివరిస్తూ ముందుగానే ఒక లేఖ రాసి ఉంచారు ముద్రగడ.. తన అంత్యక్రియలు ఎలా నిర్వహించాలనే అంశంపై స్పష్టమైన సూచనలు చేస్తూ, తన వ్యక్తిగత అభిప్రాయాలను అందులో వెల్లడించారు.
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తాను మరణిస్తే తన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించవద్దని ముద్రగడ పద్మనాభం ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసుల గౌరవ వందనం కూడా అవసరం లేదని స్పష్టం చేశారు. జీవించి ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టి, మరణానంతరం ఇచ్చే గౌరవం లేదా గుర్తింపు తనకు అవసరం లేదని లేఖలో పేర్కొన్నారు.
Also Read
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
- Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్రావు సహా పలువురిపై మరో కేసు
అలాగే కుటుంబ సంప్రదాయాల ప్రకారం తనకు దహన సంస్కారాలు చేయకుండా, ఖననం మాత్రమే చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఇంటి ఆవరణలో ఎక్కడ ఖననం చేయాలనే విషయాన్ని కూడా లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. అలా ఖననం చేస్తే తాను ఎప్పటికీ కుటుంబంతోనే ఉన్నట్లుగా భావిస్తానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా, తన మరణానంతరం తన భార్య బొట్టు, గాజులు తొలగించవద్దని, ఆమెను పుణ్యస్త్రీగానే కొనసాగించాలని కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ముద్రగడ రాసిన ఈ లేఖ ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్రావు సహా పలువురిపై మరో కేసు
-
Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
ట్రెండింగ్
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!