MS Dhoni: ఎల్లవేళలా ‘యెల్లో’ జెర్సీతోనే.. ఆసక్తికర విషయం చెప్పిన ఎంఎస్ ధోనీ!
- ఇంకా నిర్ణయం తీసుకోలేదు
- శరీరం సహకరిస్తే తప్పకుండా ఆడుతా
- ఎల్లవేళలా 'యెల్లో' జెర్సీతోనే
- నేను, సీఎస్కే ఎప్పుడూ కలిసే ఉంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni on IPL Future: ఐపీఎల్ ముగియడం.. వచ్చే సీజన్లో ఎంఎస్ ధోనీ ఆడతాడా? లేదా? అనే చర్చ జరగడం సహజమే. 2020 నుంచే ఇదే జరుగుతోంది. ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత కూడా మహీ ఆడటంపై చర్చ జరిగింది. ఇప్పటికీ ధోనీ ఏ కార్యక్రమానికి హాజరైనా ఇదే ప్రశ్న ఎదురవుతోంది. తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మహీ పాల్గొనగా.. వచ్చే సీజన్లో ఆడుతారా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ తనదైన శైలిలో స్పందించాడు. వచ్చే సీజన్పై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పాడు. ఎల్లవేళలా ‘యెల్లో’ జెర్సీలోనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను ఆడినా, ఆడకపోయినా సీఎస్కేతో అనుబంధం మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని ఎంఎస్ ధోనీ స్పష్టం చేశారు. ‘నేను ఎప్పుడూ చెప్పే మాట ఒకటే. వచ్చే సీజన్లో ఆడటంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మొన్ననే ఐపీఎల్ ముగిసింది. నాకు చాలా సమయం ఉంది. శరీరం సహకరిస్తే తప్పకుండా ఆడుతా. అంతా బాగుండాలనే నేను కోరుకుంటున్నా. మళ్లీ యెల్లో జెర్సీతోనే వస్తారా? అంటే.. ఎల్లవేళలా అని చెబుతా. నేను వచ్చే సీజన్లో ఆడతానా? లేదా? అనేది వేరే విషయం. నేను, సీఎస్కే ఎప్పుడూ కలిసే ఉంటాం. 15-20 సంవత్సరాలైనా సీఎస్కేతోనే నా ప్రయాణం’ అని ఎంఎస్ ధోనీ చెప్పాడు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
Also Read: Jagtial Murder: కాంగ్రెస్ నాయకుడి తల్లి దారుణ హత్య.. పోలీసుల అదుపులో రఘునందన్ రావు!
ఐపీఎల్ మొదటి ఎడిషన్ నుంచి ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనే ఆడాడు. చెన్నైకి 5 ట్రోఫీలు అందించారు. 2010, 2011, 2018, 2021, 2023లో సీఎస్కే ట్రోఫీ కైవసం చేసుకుంది. ధోనీ ఇప్పటివరకు ఐపీఎల్లో 278 మ్యాచ్లు ఆడి 5439 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మహీ అత్యధిక స్కోర్ 84 నాటౌట్. ఇప్పటివరకు 264 సిక్సర్లు, 375 ఫోర్లు బాదాడు. 44 ఏళ్ల ధోనీ ఐపీఎల్ 2026లో ఆడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!