MS Dhoni: ఎల్లవేళలా ‘యెల్లో’ జెర్సీతోనే.. ఆసక్తికర విషయం చెప్పిన ఎంఎస్ ధోనీ!
- ఇంకా నిర్ణయం తీసుకోలేదు
- శరీరం సహకరిస్తే తప్పకుండా ఆడుతా
- ఎల్లవేళలా 'యెల్లో' జెర్సీతోనే
- నేను, సీఎస్కే ఎప్పుడూ కలిసే ఉంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni on IPL Future: ఐపీఎల్ ముగియడం.. వచ్చే సీజన్లో ఎంఎస్ ధోనీ ఆడతాడా? లేదా? అనే చర్చ జరగడం సహజమే. 2020 నుంచే ఇదే జరుగుతోంది. ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత కూడా మహీ ఆడటంపై చర్చ జరిగింది. ఇప్పటికీ ధోనీ ఏ కార్యక్రమానికి హాజరైనా ఇదే ప్రశ్న ఎదురవుతోంది. తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మహీ పాల్గొనగా.. వచ్చే సీజన్లో ఆడుతారా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ తనదైన శైలిలో స్పందించాడు. వచ్చే సీజన్పై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పాడు. ఎల్లవేళలా ‘యెల్లో’ జెర్సీలోనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను ఆడినా, ఆడకపోయినా సీఎస్కేతో అనుబంధం మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని ఎంఎస్ ధోనీ స్పష్టం చేశారు. ‘నేను ఎప్పుడూ చెప్పే మాట ఒకటే. వచ్చే సీజన్లో ఆడటంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మొన్ననే ఐపీఎల్ ముగిసింది. నాకు చాలా సమయం ఉంది. శరీరం సహకరిస్తే తప్పకుండా ఆడుతా. అంతా బాగుండాలనే నేను కోరుకుంటున్నా. మళ్లీ యెల్లో జెర్సీతోనే వస్తారా? అంటే.. ఎల్లవేళలా అని చెబుతా. నేను వచ్చే సీజన్లో ఆడతానా? లేదా? అనేది వేరే విషయం. నేను, సీఎస్కే ఎప్పుడూ కలిసే ఉంటాం. 15-20 సంవత్సరాలైనా సీఎస్కేతోనే నా ప్రయాణం’ అని ఎంఎస్ ధోనీ చెప్పాడు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
Also Read: Jagtial Murder: కాంగ్రెస్ నాయకుడి తల్లి దారుణ హత్య.. పోలీసుల అదుపులో రఘునందన్ రావు!
ఐపీఎల్ మొదటి ఎడిషన్ నుంచి ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనే ఆడాడు. చెన్నైకి 5 ట్రోఫీలు అందించారు. 2010, 2011, 2018, 2021, 2023లో సీఎస్కే ట్రోఫీ కైవసం చేసుకుంది. ధోనీ ఇప్పటివరకు ఐపీఎల్లో 278 మ్యాచ్లు ఆడి 5439 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మహీ అత్యధిక స్కోర్ 84 నాటౌట్. ఇప్పటివరకు 264 సిక్సర్లు, 375 ఫోర్లు బాదాడు. 44 ఏళ్ల ధోనీ ఐపీఎల్ 2026లో ఆడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!