MS Dhoni: ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ హిస్టరీలోనే మొదటి ఆటగాడు!
- ఐపీఎల్లో ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు
- మొదటి అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డు
- కెప్టెన్గా వ్యవహరించిన అతి పెద్ద వయస్కుడిగా ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన మొదటి అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం చెపాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై కెప్టెన్గా బరిలోకి దిగడంతో మహీ ఈ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఏ అన్క్యాప్డ్ ప్లేయర్ కెప్టెన్గా వ్యవహరించలేదు.
బీసీసీఐ రూల్స్ ప్రకారం.. గత ఐదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఏ ఆటగాడు అయినా అన్క్యాప్డ్ ప్లేయర్గా పరిగణించబడతాడు. ఐదేళ్ల క్రితం 2019లో మహీ చివరగా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్క్యాప్డ్ కోటాలో రూ.4 కోట్లు వెచ్చించి సీఎస్కే అతడిని రిటైన్ చేసుకుంది. సీఎస్కే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టోర్నీ మొత్తంకు దూరమయ్యాడు. దాంతో ధోనీ మరలా చెన్నై పగ్గాలు అందుకున్నాడు. దాంతో ధోనీ ఐపీఎల్ హిస్టరీలోనే అన్క్యాప్డ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్లో కెప్టెన్గా వ్యవహరించిన అతి పెద్ద వయస్కుడిగా ధోనీ (43 సంవత్సరాల 278 రోజులు) మరో ఘనత సాధించాడు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Also Read: Gorantla Madhav: రాజమండ్రి సెంట్రల్ జైలుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్!
2008లో చెన్నై కెప్టెన్సీ చేపట్టిన ఎంఎస్ ధోనీ.. 2021 వరకు విజయవంతంగా కొనసాగాడు. ఈ కాలంలో నాలుగు సార్లు (2010, 2011, 2018, 2021) జట్టును ఛాంపియన్గా నిలిపాడు. 2022లో రవీంద్ర జడేజా సీఎస్కే సారథ్య బాధ్యతలు చేపట్టాడు. వరుస మ్యాచ్లలో ఓడిపోవడంతో జడేజా స్వయంగా కెప్టెన్సీని విడిచిపెట్టాడు. దాంతో సీఎస్కే ఫ్రాంచైజీ ధోనీని మరోసారి కెప్టెన్ను చేసింది. 2023లో కూడా ధోనీ కెప్టెన్గా వ్యవహరించి.. సీఎస్కేను విజేతగా నిలిపాడు. 2024లో ఎంఎస్ ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఐపీఎల్ 2025లో రుతురాజ్ గాయం కారణంగా.. ధోనీ మళ్లీ సీఎస్కే సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో