Uttam Kumar Reddy : అక్టోబర్ 6 తరువాత ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లాలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పలు కుటుంబాలు చేరాయి.. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఉత్తమ్.. ఈ సందర్భంగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 6 తరువాత ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆయన వెల్లడించారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో 70 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, తెలంగాణతో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంను ఏర్పాటు చేస్తుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాహుల్ ప్రధాని అవడానికి ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలే తొలిమెట్టు అని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు భాజపా ఎన్నికల కోసమే ప్రవేశ పెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు సోనియా గాంధీ మానస పుత్రిక…మేం సంపూర్ణ మద్దతు ప్రకటించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
Also Read : Amazon Forest:100 డాల్ఫిన్ లు మృతి.. కారణం ఇదీ..
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
అంతేకాకుండా.. పైన పెద్ద మోడీ ఉంటే కేసీఆర్ చిన్న మోడీలా తయారయ్యాడని ఆయన విమర్శించారు. మేం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు డబ్బా ఇళ్లు అని హేళన చేసిన కేసీఆర్…ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క ముదిరాజ్ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించలేదని, ఒక్క మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి లేదని ఆయన అన్నారు. హుజూర్ నగర్ కి చెందిన వైన్ షాప్ నిర్వాహకులు ఒక్కో షాప్ వద్ద నుంచి 6లక్షల రూపాయిల లంచం ఎమ్మెల్యే సైదిరెడ్డి వసూలు చేశారు…రైస్ మిల్లర్ల దగ్గర నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడట.. పోలీసులు జాగ్రత్త ఎక్స్ట్రా లు చేయవద్దు… అక్రమ కేసులు పెడితే ఊరుకునే సమస్య లేదు. ఎన్నికల తరువాత వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు ఉత్తమ్ కుమార్. సాగర్ ఎడమ కాలువ రైతులకు నీళ్ళు లేక పంటలు ఎండి పోతున్నాయని, 24 గంటల విద్యుత్తు విషయంలో ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందన్నారు.
Also Read : Jammu Kashmir: బోల్తా పడిన యాపిల్ లారీ.. తర్వాత ఏం జరిగిందంటే..!
తాజావార్తలు
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!