Deepak Chahar: సీఎస్కే కెప్టెన్ ఎవరో తెలియక తికమక పడుతున్నా: దీపక్ చహర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepak Chahar Said I got to look at MS Dhoni and at Ruturaj Gaikwad: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్సీపై ఆ జట్టు స్టార్ బౌలర్ దీపక్ చహర్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. సీఎస్కే కెప్టెన్ ఎవరో తెలియక తాను కాస్త తికమక పడుతున్నా అని పేర్కొన్నాడు. బౌలింగ్ చేసే సమయంలో తాను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత సారథి రుతురాజ్ గైక్వాడ్ వైపు చూస్తున్నా అని చెప్పుకొచ్చాడు. సీఎస్కే కెప్టెన్గా ధోనీ స్వయంగా తప్పుకోవడంతో.. ఐపీఎల్ 2024లో జట్టు పగ్గాలను రుతురాజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఎంతో అనుభవం ఉన్న మహీ.. మైదానంలో రుతురాజ్కు సలహాలు, సూచనలు ఇస్తున్న సంగతి తెలిసిందే.
మంగళవారం రాత్రి గుజరాత్తో జరిగిన మ్యాచ్ అనంతరం దీపక్ చహర్ మాట్లాడుతూ.. మైదానంలో ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్లలో ఎవరి ఆదేశాలు వినాలో తెలియట్లేదని అన్నాడు. ‘మైదానంలో సూచనల కోసం ధోనీ, రుతురాజ్లలో ఎవరివైపు చూడాలో తెలియక కాస్త తికమక పడుతున్నా. అందుకే ఇద్దరివైపు చూస్తున్నా. రుతురాజ్ జట్టును గొప్పగా నడిపిస్తున్నాడు’ అని చహర్ తెలిపాడు. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో చహర్ రెండు కీలక వికెట్లు తీశాడు. గుజరాత్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (21), శుభ్మన్ గిల్ (8)ను ఔట్ చేశాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చాడు.
Also Read
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
- Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
Also Read: SRH vs MI: సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్.. రోహిత్ శర్మకు చాలా ప్రత్యేకం!
ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ.. ఐపీఎల్ నిర్వాహకులు కొత్త రూల్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దీపక్ చహర్ స్పందిస్తూ… ‘ఐపీఎల్ కెరీర్ ఆరంభం నుంచి నేను పవర్ప్లేలో 3 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాను. నేను దానికి అలవాటు పడ్డాను. కొత్త నిబంధనలతో వీలైనంత బాగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇదివరకు ఓవర్లో తొలి 3 బంతుల్లో బౌన్సర్ వేస్తే.. మిగతావి లైన్ అండ్ లెంగ్త్తో వస్తాయని బ్యాటర్లు అంచనా వేసేవారు. ఇప్పుడు ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లు వేసే అవకాశం లభించింది. దీంతో బ్యాటర్లపై బౌలర్లు పైచేయి సాధించేందుకు అవకాశం ఉంది. కొత్త రూల్ పేసర్లకు చాలా ఉపయోగకరం’ అని చెప్ప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!