NTV Telugu Site icon

MP Nandigam Suresh: సీఎం జగన్ పేదల వైపు ఉంటే.. చంద్రబాబు పెత్తందార్ల వైపు ఉన్నారు..

Mp Nandigama Suresh

Mp Nandigama Suresh

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పేదల పక్కన ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పెత్తందార్ల వైపు ఉన్నారు అని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని తట్టుకోలేక చంద్రబాబు తమ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుంది. కుప్పంలో తనను పెద్దిరెడ్డి ఓడిస్తాడని చంద్రబాబు భయపడుతున్నాడు అని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు.

Read Also: Apple Shoe’s : యాపిల్ కంపెనీ బూట్లు.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులు, అవమానాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదు అని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను చంద్రబాబు అన్ని రకాలుగాను మోసం చేశాడు.. సీఎం జగన్ ప్రభుత్వంలో మా వర్గాలన్నీ సంతోషంగా, గౌరవంగా ఉన్నాయని ఆయన కామెంట్స్ చేశారు. ఎస్సీల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ పార్టీకి లేదు అంటూ ఎంపీ నందిగం సురేష్ చెప్పారు.

Read Also: Car Buying: తక్కువ ప్రైజ్లో కారు కొనాలనుకుంటున్నారా.. రూ.7 లక్షల కంటే తక్కువ ధర కార్లు ఇవే

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న విష ప్రచారం బంద్ చేయాలని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. లేదంటే మీకు తగిన బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. త్వరలోనే చంద్రబాబు, లోకేష్ లకు సరైన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు నిశ్చయించుకున్నారు అని ఎంపీ చెప్పారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలో వస్తామని నందిగం సురేష్ ధీమా వ్యక్తం చేశారు.. ఈ సారి రాష్ట్రంలో 175 సీట్లకు 175 గెలుస్తామని వెల్లడించారు.