MP MV vs MLA Velagapudi: ఎమ్మెల్యే వెలగపూడికి ఎంపీ ఎంవీవీ ఛాలెంజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఛాలెంజ్ విసిరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో పీకుతాను అంటున్నాడని.. తన వెంట్రుక కూడా పీకలేడని ఆరోపించారు. రామకృష్ణ బాబు అవకాశ వాదని దుయ్యబట్టారు. యాదవ సామాజిక వర్గాన్ని తొక్కేసిన వాడు వెలగపూడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగాని అడ్డంగా నరికి చంపి పారిపోయిన వ్యక్తి వెలగపూడి.. అటువంటి రామకృష్ణ బాబు ఇప్పుడు రంగులు మార్చి జనసేన అధినేత ఫోటో పెట్టుకుని కాపుల ముందుకు వెళుతున్నాడని దుయ్యబట్టారు. తాను చేస్తున్నది నిర్మాణ రంగంలో.. వెలగపూడిలా కల్తీ మద్యం అమ్మి ఎదగలేదని విమర్శించారు. స్థాయి లేని వంశీకృష్ణ లాంటి వాళ్ళ పై స్పందించకూడదనే ఇంత కాలం మాట్లాడలేదన్నారు. తాను ఎవరి మీద వ్యక్తిగత ఆరోపణలు చేసే వ్యక్తిని కాదని పేర్కొన్నారు.
Nike Layoff 2024: 1,600 మంది ఉద్యోగులను తొలగించనున్న నైకీ..
Also Read
- Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
- Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
- PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
వెలగపూడి వంశీ వ్యాఖ్యల పై ఎంవీవీ సత్యనారాయణ సీరియస్ గా స్పందించారు. 2019లో వంశీకి టికెట్ దక్కకపోవడానికి తాను కారణం కాదని తెలిపారు. అప్పుడు పోటీ చేసిన అక్కరమానికి బదులు వంశీనే బెటర్ అభ్యర్ధి అని సీఎంకు చెప్పానని అన్నారు. ఈ విషయం తెలీక వంశీ తనపై అనుమానం పెంచుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారని ఆరోపించారు. పార్టీ మారిన తర్వాత వంశీ అనేక సార్లు తనపై విమర్శలు చేసిన స్పందించలేదని తెలిపారు. వంశీని రెండు సార్లు ఓడించి మళ్లీ సిగ్గులేకుండా వంశీ ఇంటికి వెళ్ళి ఆయన తిడుతూ ఉంటే వెలగపూడి నవ్వుతూ ఉన్నాడని చెప్పారు. వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయి అయిన వెలగపూడి.. ఆయన్ను ఆరాధించే జనసేన పార్టీ నేత అయిన వంశీ ఇంటికి వెళ్ళి తనపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ తనపై గతంలో విమర్శలు చేస్తే తిరిగి చేశాను తప్ప.. తాను ఎప్పుడూ అనవసరంగా విమర్శలు చేయనని సత్యనారాయణ తెలిపారు.
TG Vishwa Prasad: అమెరికాలో చిరంజీవికి సన్మానం..ఆనందంగా ఉందన్న విశ్వ ప్రసాద్
రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వంశీ.. విజయసాయి రెడ్డి దయ వల్ల కార్పొరేటర్ అయ్యారని ఎంవీవీ పేర్కొన్నారు. వంశీ కనీసం ఒక్క మనిషిగా కూడా మాట్లాడలేదు.. వంశీ పై చెక్ బౌన్స్ కేసులు, ఆస్తుల అటాచ్మెంట్స్ ఉన్నాయని తెలిపారు. మేకప్ వేస్తే బాబు మోహన్ కంటే తక్కువ స్థాయి కేరక్టర్ ఆర్టిస్ట్ లా ఉండే వంశీ నన్ను తంతాడట అని మండిపడ్డారు. కుక్క కంటే దారుణమైన పంది జాతికి చెందిన వాడు వంశీ అని దుయ్యబట్టారు. రంగాను వెలగపూడి ఎలా చంపాడో బయట పెడతానని అన్నారు. తానేదో భూ అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు చేస్తున్నారని.. వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నన్నేదో చేస్తానన్నట్టు చెప్తున్నారని ఎంవీవీ తెలిపారు. నా వెంటుక పీక్కోమని వెలగపూడికి చెప్తున్నా.. నా అక్రమాలపై ఆధారాలు ఉంటే తీసుకురండని సత్యనారాయణ అన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!