తెలంగాణ బీజేపీ స్టేట్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. సావిత్రి భాయి పూలే ఆశయాలను మోడీ కొనసాగిస్తున్నారు.. కేంద్ర మంత్రివర్గంలో మహిళలకు పెద్ద పీట వేశారు అని తెలిపారు. మహిళ స్వయం శక్తి బృందాలకు చేయూతనిస్తున్నారు.. అలాగే, కేంద్ర ప్రభుత్వం మహిళ సాధికారతకు కృషి చేస్తుంది.. కేంద్ర ప్రభుత్వం త్రిబుల్ తలాక్ ను రద్దు చేశాం.. చట్ట సభల్లో మహిళ రిజర్వేషన్ లు కల్పించామని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
Read Also: Prashanth Neel: తల అజిత్ తో నీల్ బ్రోనా? కాస్త చూసి వార్తలు స్ప్రెడ్ చేయండయ్యా…
అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు అనే విషయాన్ని ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. నొక్కిన డబ్బును కక్కిస్తామని చెప్పారు.. అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.. సీబీఐ విచారణ చేయిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.. బీఆర్ఎస్- కాంగ్రెస్ వేరు కాదని ఇప్పుడు నిరూపితం అవుతుందని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఆ పార్టీలు కలుస్తాయని బీజేపీ ముందే చెప్పింది.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీలు కలిసి పని చేస్తాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు.