Emperor Vikramaditya : ప్రధాని పిలుపు మేరకు నాటక ప్రదర్శన.. అతిథిగా మధ్యప్రదేశ్ సీఎం
Emperor Vikramaditya : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ రాజధాని హైదరాబాదుకు రానున్నారు. భారత ప్రధాని పిలుపు మేరకు ఏక్ భారత్ శ్రేష్ట భారత్ నినాదంతో ఈ నెల 10,11,12 తేదీల్లో సామ్రాట్ విక్రమాదిత్య నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరవుతారు. ఇందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా నున్న HMT గ్రౌండ్ వేదికైంది. ఈ నాటకం ఉద్దేశ్యం సాంస్కృతిక విలువల పట్ల సాంస్కృతిక పరిజ్ఞానం పట్ల అభిమానం స్వాభిమానం పెంచాలని దృక్పథంతో ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు మధ్య ప్రధేశ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నాటకాన్ని ప్రధర్శిస్తున్నారు. గ్రౌండ్ లో స్టేజ్ నిర్మాణం పనులను బీజేపీ జాతీయ నాయకులు, మధ్య ప్రదేశ్ ఇంచార్జి మురళీధర్ రావు పరిశీలించారు. సామ్రాట్ విక్రమాదిత్య ఉత్సవ్ ను జయప్రదం చేయాలని కోరారు. రాజా విక్రమాదిత్య గొప్ప తనాన్ని చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
Read Also: Minister KTR: ప్రతి నియోజకవర్గం నుంచి పదివేల మంది రావాలి
Also Read
- Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
- PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..
- School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
- Nitin Gadkari: "కులం గురించి మాట్లాడితే తన్నులు పడతాయ్".. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాదే ఎందుకు వేదికైంది..
శతాబ్దాలుగా అమ్మమ్మలు, బైటల్ పచ్చిసీ కథలు ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్ ద్వారా ప్రదర్శించబడిన సామ్రాట్గానే విక్రమాదిత్య ప్రపంచానికి తెలుసు. విక్రమాదిత్యుడు శకుల వంటి ఆక్రమణదారులను ఓడించాడని ప్రజలకు తెలుసు, కాని అతను చాలా అరుదుగా భారతీయ పాలకులతో పోరాడి, ముఖ్యంగా ఆంధ్ర శాతవాహనులతో స్నేహపూర్వక రాజ్యాల సమూహాన్ని సృష్టించాడని చాలా మందికి తెలియదు. అతడు ఏర్పాటు చేసిన రాజ్య భూభాగాలు తెలంగాణాలో ఉన్నాయి. అందుకే ఈ ఈవెంట్ కు హైదరాబాద్ వేడుకైంది. మూడు రోజుల ఈవెంట్ ఫిబ్రవరి 10 న హైదరాబాద్లోని హెచ్ఎంటి మైదానంలో ప్రారంభమవుతుంది. సీఎం శివరాజ్సింగ్ దీన్ని ప్రారంభించనున్నారు. సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ కూడా హాజరవుతారని విక్రమాదిత్య శోధ్ పీఠ్ డైరెక్టర్ శ్రీరామ్ తివారీ తెలిపారు. ఉత్సవ్లో రాజుపై మహా నాట్యాన్ని ప్రదర్శించనున్నారు. ఇందులో ఉజ్జయిని నుండి దాదాపు 200 మంది కళాకారులు పాల్గొంటారు. రాజు, విక్రమ్ కాలం నాటి ముద్రలు, వస్తువులపై ప్రదర్శనలు ఉంటాయని తివారీ తెలిపారు.
తాజావార్తలు
-
Samsung Galaxy F17e 5G: సామ్ సంగ్ 5G ఫోన్ కేవలం రూ.13,774 కే.. 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
-
PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..
-
School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
-
Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!