Emperor Vikramaditya : ప్రధాని పిలుపు మేరకు నాటక ప్రదర్శన.. అతిథిగా మధ్యప్రదేశ్ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emperor Vikramaditya : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ రాజధాని హైదరాబాదుకు రానున్నారు. భారత ప్రధాని పిలుపు మేరకు ఏక్ భారత్ శ్రేష్ట భారత్ నినాదంతో ఈ నెల 10,11,12 తేదీల్లో సామ్రాట్ విక్రమాదిత్య నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరవుతారు. ఇందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా నున్న HMT గ్రౌండ్ వేదికైంది. ఈ నాటకం ఉద్దేశ్యం సాంస్కృతిక విలువల పట్ల సాంస్కృతిక పరిజ్ఞానం పట్ల అభిమానం స్వాభిమానం పెంచాలని దృక్పథంతో ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు మధ్య ప్రధేశ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నాటకాన్ని ప్రధర్శిస్తున్నారు. గ్రౌండ్ లో స్టేజ్ నిర్మాణం పనులను బీజేపీ జాతీయ నాయకులు, మధ్య ప్రదేశ్ ఇంచార్జి మురళీధర్ రావు పరిశీలించారు. సామ్రాట్ విక్రమాదిత్య ఉత్సవ్ ను జయప్రదం చేయాలని కోరారు. రాజా విక్రమాదిత్య గొప్ప తనాన్ని చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
Read Also: Minister KTR: ప్రతి నియోజకవర్గం నుంచి పదివేల మంది రావాలి
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
హైదరాబాదే ఎందుకు వేదికైంది..
శతాబ్దాలుగా అమ్మమ్మలు, బైటల్ పచ్చిసీ కథలు ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్ ద్వారా ప్రదర్శించబడిన సామ్రాట్గానే విక్రమాదిత్య ప్రపంచానికి తెలుసు. విక్రమాదిత్యుడు శకుల వంటి ఆక్రమణదారులను ఓడించాడని ప్రజలకు తెలుసు, కాని అతను చాలా అరుదుగా భారతీయ పాలకులతో పోరాడి, ముఖ్యంగా ఆంధ్ర శాతవాహనులతో స్నేహపూర్వక రాజ్యాల సమూహాన్ని సృష్టించాడని చాలా మందికి తెలియదు. అతడు ఏర్పాటు చేసిన రాజ్య భూభాగాలు తెలంగాణాలో ఉన్నాయి. అందుకే ఈ ఈవెంట్ కు హైదరాబాద్ వేడుకైంది. మూడు రోజుల ఈవెంట్ ఫిబ్రవరి 10 న హైదరాబాద్లోని హెచ్ఎంటి మైదానంలో ప్రారంభమవుతుంది. సీఎం శివరాజ్సింగ్ దీన్ని ప్రారంభించనున్నారు. సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ కూడా హాజరవుతారని విక్రమాదిత్య శోధ్ పీఠ్ డైరెక్టర్ శ్రీరామ్ తివారీ తెలిపారు. ఉత్సవ్లో రాజుపై మహా నాట్యాన్ని ప్రదర్శించనున్నారు. ఇందులో ఉజ్జయిని నుండి దాదాపు 200 మంది కళాకారులు పాల్గొంటారు. రాజు, విక్రమ్ కాలం నాటి ముద్రలు, వస్తువులపై ప్రదర్శనలు ఉంటాయని తివారీ తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!