NTV Telugu Site icon

MP Avinash Reddy : సీబీఐ ఎంక్వైరీపై అవినాష్ రెడ్డి ఏమన్నారంటే?

Mp Avinash

Mp Avinash

ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు హాజరయ్యారు. సీబీఐ విచారణపై ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడారు. సిబిఐ అధికారులు ఇచ్చిన 160 crpc నోటీసుల ప్రకారం నేను విచారణకు హాజరయ్యాను.విచారణ పారదర్శకంగా జరగాలని సీబీఐ అధికారులను కోరాను.సిబిఐ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను..సిబిఐ అధికారులకు ఉన్న అనుమానాలకు నా సమాధానాలతో నివృత్తి చేశాను…

Read Also: Tarakaratna: అన్న ఆరోగ్యంపై తమ్ముడి ట్వీట్.. వైరల్

మళ్లీ ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తాను అని చెప్పానన్నారు. .ప్రజలకు కేసుకు సంబంధించిన వివరాలు తెలియాలని వీడియో అనుమతి కోరారు. నాలుగున్నర గంటల పాటు సిబిఐ అధికారులు నన్ను విచారించారు..ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన విషయాలు ఏవి ఇప్పుడు బహిర్గతం చేయలేను..కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నాయని అవినాష్ రెడ్డి మండిపడ్డారు.నాకు crpc 160 ప్రకారం నన్ను విచారించి…నా స్టేట్మెంట్ రికార్డ్ చేశారన్నారు అవినాష్ రెడ్డి.