Fire Accident : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. పొగ, బూడిదతో అల్లాడుతున్న జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident : దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్లో ఉన్న చెత్త పర్వతంలో ఆదివారం మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు చెత్త కొండలో ఎక్కువ భాగాన్ని చుట్టుముట్టాయి. మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. చెత్తకుప్పల నుంచి వెలువడుతున్న పొగ చుట్టుపక్కల కాలనీలకు వ్యాపించింది. ఘాజీపూర్ చుట్టుపక్కల నివసించే ప్రజలు ఊపిరాడటం, కళ్లలో మంటను అనుభవించడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులే కాకుండా తొమ్మిది అగ్నిమాపక దళ వాహనాలను సంఘటనా స్థలానికి తరలించారు.
Read Also:Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రేపు మద్యం దుకాణాలు బంద్
Also Read
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
- AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
చెత్తాచెదారం పైభాగంలో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్థరాత్రి వరకు మంటలను అదుపు చేయలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది మాట్లాడుతూ చెత్త పర్వతాలలో మంటలు చాలా రోజుల పాటు ఉంటాయి. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక చోట మంటలు ఆర్పితే మరో చోట మంటలు చెలరేగుతాయి. ల్యాండ్ ఫిల్ సైట్ సమీపంలో నివసించే స్థానికులు వేసవిలో ఇక్కడ తరచుగా అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి.
Read Also:American Citizenship: అమెరికా పౌరసత్వాల్లో రికార్డ్ సృష్టించిన భారతీయులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5.22 గంటల ప్రాంతంలో ఘాజీపూర్ ల్యాండ్ ఫిల్ సైట్ లో మంటలు చెలరేగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నీరు పోయడం వల్ల మంటలు తగ్గుముఖం పట్టాయి, కానీ పొగ పెరుగుతూ వచ్చింది. నీరు ఆరిపోగానే మళ్లీ మంటలు చెలరేగాయి. చెత్త ఒత్తిడి వల్ల అక్కడ మిథేన్ గ్యాస్ ఏర్పడుతుందని, దీంతో మళ్లీ మళ్లీ మంటలు చెలరేగుతున్నాయని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. వేడి కారణంగానే మంటలు చెలరేగాయో లేక మానవ తప్పిదాల వల్లనో తెలియరాలేదు. ప్రస్తుతం ఘటనా స్థలంలో అగ్నిమాపక వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
తాజావార్తలు
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
-
Diabetes: షుగర్ కంట్రోల్కు ఈ 3 కూరగాయలు బెస్ట్.. నిపుణుల సూచనలు ఇవే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!