Mother Kills Daughter: తిరుపతిలో ప్రియుడు కోసం కన్న కూతురినే ఓ కసాయి తల్లి కడతేర్చింది. ప్రియుడితో కలిసి రెండున్నరేళ్ల చిన్నారి దుర్గను దారుణంగా ఆషాలత హతమార్చంది. భర్త రాజేష్తో విడిపోయి పోస్టల్ కాలనీలో తల్లి నివాసం ఉంటుంది. ఏర్పేడు మండలం చెన్నపల్లికి చెందిన రెడ్డి కుమార్తో ఆషాలత గత కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. పెళ్లి చేసుకోవాలని ప్రియుడిపై ఆమె ఒత్తిడి తెచ్చింది. చిన్నారి అడ్డుగా ఉందని వివాహానికి రెడ్డి కుమార్ నిరాకరించాడు. దీంతో ఇద్దరూ కలిసి చిన్నారిని చంపి పాపానాయుడు పేట స్వర్ణముఖి నదిలో పాతిపెట్టారు.
అయితే, తమ మనవరాలు కనిపించడం లేదని అమ్మమ్మ రంగ నాగరత్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు తల్లి ఆషాలత ను తమదైన స్టైల్ లో విచారణ చేయగా, అక్రమ సంబంధం వల్లే త కూతుర్ని చంపేసినట్లు ఒప్పుకోవడంతో.. ఆషాలత, రెడ్డి కుమార్లను అదుపులోకి తీసుకున్నారు.