Shocking: నాలుగేళ్ల కూతురుని కత్తితో పొడిచిన తల్లి.. ఎందుకిలా చేసింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హత్యలు, కిడ్నాప్ లు, మర్డర్లు, మానభంగాలు అంటూ ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కానీ పూణెలో నవమాసాలు మోసి కని నాలుగేళ్ల పాటు పెంచిన కూతురిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. ఈ షాకింగ్ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. సాధారణంగా ఏ తల్లైనా తన బిడ్డలకు చిన్న గాయమైనా తట్టుకోలేరు. ఎంత కష్టపడైనా తన బిడ్డలను ఆపదల నుంచి సురక్షితంగా బయటపడేసేందుకు ప్రయత్నిస్తుంది. పిల్లలను కాపాడుకోవడానికి తన ప్రాణాలను పణంగా పెట్టే తల్లుల గురించి విన్నాం కానీ… అయితే పూణెలో వెలుగుచూసిన ఈ షాకింగ్ ఘటన అందరినీ కలిచివేసింది. ఈ ఘటన హదప్సర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Read Also: Strange Incident : ఒకే కాన్పులో నలుగురు.. ఎక్కడో కాదు మన దగ్గరే
Also Read
- Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
- CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
- Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్లో ఉన్నది అదే అంటూ..
- US-Iran: తూచ్.. హార్ముజ్పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్హౌస్ ఖండన
కల్పన అనే మహిళ తన కుమార్తెతో ఒంటరిగా జీవిస్తోంది. ఈ సంఘటన సోమవారం (మార్చి 27) రాత్రి 9:30 గంటలకు హడప్సర్లోని సిద్ధివినాయక్ దుర్వాంకూర్ సొసైటీ ససానే నగర్లో జరిగింది. అయితే బాలిక ఎందుకు హత్యకు గురైందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసులో ఆమె తల్లి కల్పనను హడప్సర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23 రోజుల క్రితం, సంబంధిత కుటుంబం అక్కడ ఉండటానికి వచ్చింది. కల్పన బేకరీ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారం చేస్తోంది. కల్పన సోమవారం అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంది. దీంతో ఇంటి యజమాని అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె లోపలి నుంచి తలుపు వేసుకుంది. ఇరుగుపొరుగు వారు ఆమెను తలుపు తెరవాలని కోరారు. ఇంటి యజమాని, ఇరుగుపొరుగు వారు లోపలికి వెళ్లి బాలిక మృతదేహాన్ని చూశారు. దీంతో వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. దీనిపై హడప్సర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు. హత్య వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Read Also:Minister KTR: రేవంత్ రెడ్డి, బండి సంజయ్లకు కేటీఆర్ షాక్.. 100 కోట్ల మేర పరువునష్టం దావా నోటీసులు
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!