Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Most Gujarat Poll Candidates With Criminal Record From Aap Bjp

Gujarat Elections: గుజరాత్‌ ఎన్నికలు.. 20 శాతం అభ్యర్థులు నేరచరితులే.. ఆప్‌దే అగ్రస్థానం

Published Date :November 29, 2022 , 9:30 am
By Mahesh Jakki
Gujarat Elections: గుజరాత్‌ ఎన్నికలు.. 20 శాతం అభ్యర్థులు నేరచరితులే.. ఆప్‌దే అగ్రస్థానం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gujarat Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1,621 మంది అభ్యర్థుల్లో 330 మంది అంటే దాదాపు 20 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం వెల్లడించింది. అలాంటి 61 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రస్థానంలో ఉంది. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల సంఖ్య 238గా ఉండగా.. ఈ సారి పెరిగింది. రెండు దశల అభ్యర్థుల సర్వే అనంతరం ఏడీఆర్ సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం కాంగ్రెస్‌కు చెందిన 60 మంది అభ్యర్థులు, అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన 32 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. గుజరాత్‌లో నేటితో తొలిదశ ఎన్నికల ప్రచారం ముగియనుంది.

మొత్తం 192 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం, హత్యాయత్నానికి సంబంధించిన తీవ్రమైన నేరాల కింద కేసులు నమోదు చేయబడ్డాయి. ఇందులో 96 మంది కాంగ్రెస్, బీజేపీ, ఆప్‌కి చెందినవారు, పోటీలో ఉన్న మొత్తం 1,621 మంది అభ్యర్థుల అఫిడవిట్‌లను విశ్లేషించిన ఏడీఆర్ సర్వే అనంతరం ఈ మేరకు తెలిపింది. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. వారి పేర్లపై క్రిమినల్ కేసులు ఉన్న 330 మంది అభ్యర్థుల్లో మొదటి దశలో 167 మంది 89 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. రెండో దశలో 788 మంది అభ్యర్థులలో 163 మంది 93 స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది.

Also Read

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..

తీవ్రమైన నేరాలకు పాల్పడిన అభ్యర్థుల విషయానికొస్తే, ఆప్ 43 మందితో అగ్రస్థానంలో ఉంది. కాంగ్రెస్ 28, బీజేపీ 25 మందితో రెండో స్థానంలో ఉంది. గుజరాత్‌ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ నుంచి వరుసగా 181, 179, 182 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తీవ్రమైన నేరాలను నాన్-బెయిలబుల్ నేరాలుగా నిర్వచిస్తున్నట్లు ఏడీఆర్‌ తెలిపింది. 18 మంది అభ్యర్థులు మహిళలపై నేరాలకు పాల్పడగా, ఒక అభ్యర్థిపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. ఐదుగురి పేర్లపై హత్య ఆరోపణలు ఉన్నాయి. 20 మంది హత్యకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

China: జీ జిన్‌పింగ్‌ దిగిపో.. కొవిడ్‌ ఆంక్షలపై చైనీయుల ఆందోళనలు

అహ్మదాబాద్ జిల్లాలోని దస్క్రోయ్ స్థానం నుంచి ఆప్ టికెట్‌పై పోటీ చేస్తున్న కిరణ్ పటేల్‌పై హత్య కేసు నమోదైంది. పటాన్ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కిరీట్ పటేల్‌పై హత్యాయత్నం కేసు నమోదు కాగా, పంచమహల్ జిల్లాలోని షెహ్రా స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీకి చెందిన జెథా భర్వాద్ అత్యాచారం, అపహరణ, దోపిడీ, మహిళ పట్ల అణకువగా వ్యవహరించడం మొదలైన అభియోగాలు ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక సమయంలో రాజకీయ పార్టీలపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలాంటి ప్రభావం చూపలేదని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.

ఫిబ్రవరి 13, 2020న సుప్రీంకోర్టు, అటువంటి ఎంపికకు గల కారణాలను తెలియజేయాలని.. నేరారోపణలు లేని ఇతర వ్యక్తులను అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేయకూడదని రాజకీయ పార్టీలను ప్రత్యేకంగా ఆదేశించింది. ఈ తప్పనిసరి మార్గదర్శకాల ప్రకారం అటువంటి ఎంపికకు గల కారణాలు సంబంధిత అభ్యర్థి అర్హతలు, విజయాలు, మెరిట్‌ను సూచిస్తాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • aam admi party
  • ADR report
  • Association for Democratic Reforms
  • bjp
  • congress

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions