Mohammad Yousuf: “మీ రాజకీయాలే ముంచేశాయ్”.. జట్టు ఓటమిపై పాకిస్థాన్ లెజెండరీ యూసఫ్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Yousuf: నిన్న (ఆదివారం) శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను ఇరు దేశాలు ఎప్పటికీ మర్చిపోలేవు. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓటమి ఆ దేశస్థులను తీవ్రంగా కలిచివేసింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ప్రపంచానికి భారత్–పాకిస్థాన్ మధ్య ఉన్న అసలు తేడాను మరోసారి చూపించింది. అయితే.. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఓటమిపై ఆ దేశ లెజెండరీ క్రికెటర్ మొహమ్మద్ యూసఫ్ తీవ్రంగా విమర్శించాడు. సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ ట్వీట్ చేశాడు.. “రాజకీయ ప్రభావం, వ్యక్తిగత అజెండాలు తొలగించకపోతే పాకిస్థాన్ మళ్లీ పుంజుకోదు. ఇది మన క్రికెట్ చరిత్రలోనే అత్యంత చీకటి కాలం” అని ట్వీట్లో పేర్కొన్నాడు. అర్హత లేని వ్యక్తులు పదవుల్లో ఉంటే జట్టు ఎలా ముందుకు వెళ్తుందని ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై పరోక్ష విమర్శలు చేశాడు.
READ MORE: Trisha vs Nayinar Nagendran: త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత నాగేంద్రన్
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
వాస్తవానికీ.. నఖ్శీ నిర్ణయాలు ఎప్పటినుంచో రాజకీయ రంగు పులుముకున్నవేనని విమర్శలు ఉన్నాయి. ఆసియా కప్ 2025 సమయంలో భారత్ అతని చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడంతో ట్రోఫీని స్టేజ్ నుంచి తీసుకెళ్లడం పెద్ద వివాదంగా మారింది. ఇలాంటి దిక్కుమాలిన పని చేసిందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అతడిని సత్కరించడం మరింత చర్చకు దారి తీసింది. టీ20 వరల్డ్ కప్కు ముందు భారత్తో మ్యాచ్ బహిష్కరించాలనే ఆలోచన వచ్చింది. ఇందుకు నఖ్వీ పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్తో సమావేశం ఏర్పాటు చేశాడు. బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తొలగించాని ప్రధానిని ఒప్పించినట్లు తెలిసింది. తర్వాత ఐసీసీ అధికారులతో చర్చలు జరిగాక ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. ఈ సంఘటన క్రికెట్ కంటే రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కనిపించిందని చాలామంది భావిస్తున్నారు. ఈ బహిష్కరణ డ్రామా జట్టుపై ప్రభావం చూపిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మ్యాచ్పై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఇలాంటి అంశాలు రావడం వల్లే కొలంబోలో భారత్ చేతిలో పాకిస్థాన్ అవమానకర ఓటమి చవిచూసిందని అభిప్రాయాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..